సాధారణంగా దొంగలు ఇళ్లలోకి, షాపుల్లోకి దూరి.. దొరికినంత బంగారం, డబ్బులు దొచుకుని క్షణాల్లో అక్కడి నుంచి పారిపోతుంటారు. దొంగలు చోరీల సమయంలో అంతచురుకుగా వ్యవహరిస్తుంటారు. అయినప్పటికి పలు సందర్భాల్లో పోలీసులకు దొరికిపోతుంటారు. అయితే ఇద్దరు దొంగలు వైన్ షాపులో దొంగతనానికి వెళ్లి.. అక్కడ మందు వాసనకు ఫిదా అయ్యారు. చోరీకి వచ్చిన సంగతి మరచి తాగడంలో నిమగ్నమయ్యారు. అంతే.. ఏముందు.. అటుగా పోలీసులు రావడం వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. ఈఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'పని పాతర పెట్టి లచ్చి జాతరకు పోయింది' అని పెద్దలు అన్న మాట ఆ దొంగలిద్దరికి కరెక్ట్ గా సరిపోతుంది. తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలోని తిరువళ్లూరు గ్రామానికి బయట ఓ వైన్ షాపు ఉంది. మందుకు డబ్బులు లేవో, లేదా డబ్బుల కోసమే తెలియదు కానీ ఆ దుకాణంపై ఇద్దరు దొంగలు కన్నేశారు. వైన్ షాప్ కి వెనుకవైపు గోడకు మనిషి దూరేంత కన్నం పెట్టారు. ఇక అందులో నుంచి దూరి.. మద్యం దుకాణంలోకి అడుపెట్టారు దొంగలు. అక్కడ మందు సీసాలు, డబ్బులో పట్టుకుని పోకుండా దొంగలు.. మందను చూడగానే అక్కడే ఆగిపోయారు. అక్కడే కూర్చోని నచ్చిన బ్రాండ్ మందు తీసుకుని ముందు పెట్టుకుని తాగుకుంటూ కూర్చున్నారు. ఈక్రమంలో పెట్రోలింగ్ వచ్చిన పోలీసులు అనుమానం వచ్చి అటుగా వెళ్లారు. అక్కడి వెళ్లి చూసే సరికి ఆ దొంగలు బిందాస్ గా కూర్చోని మందు తాగుతున్నారు. వెంటనే షాపు షటర్లు తెరచి పోలీసులు వారిని పట్టుకున్నారు. అయితే అంత చిన్న కన్నంలో ఎలా పట్టారు అనే అనుమానం పోలీసులకు వచ్చింది. దీంతో దొంగల చేత లోపలకి ఎలా వెళ్లారు అనే దానిపై డెమో చేపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు మగాళ్లు రా... బుజ్జి అని మందుబాబులు అంటూంటే.. మీరు దొంగల జాతిలో చెడపుట్టినారు అని దొంగలు అంటున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: వీడియో: ఇంటర్ విద్యార్థి రీల్స్ సరదా.. ట్రైన్ ఢీకొట్టడంతో..! ఇదీ చదవండి: వీడియో: స్నేహితుడి బర్త్డే వేడుకలో డ్యాన్స్ చేస్తూనే ఒక్కసారిగా..!