Men: నిత్యం భార్యల్ని వేధించే భర్తలు ఉన్నట్లే.. భర్తల్ని వేధించే భార్యలు కూడా ఈ సమాజంలో ఉన్నారు. అయితే, మహిళల్ని రక్షించేందుకు గృహ హింస చట్టాలు ఉన్నట్లు.. పురుషులకు లేవు. అందుకే తమ బాధను ఎవరికి చెప్పుకోలేక.. పోలీసులకు చెబితే సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలా మంది భర్తలు అల్లాడిపోతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ఎవరికీ భయపడుకుండా ముందుకు వస్తున్నారు. భార్యల కారణంగా తాము పడుతున్న బాధలను అందరికీ చెబుతున్నారు. మరికొంత మంది మరొక్క అడుగు ముందుకు వేసి భార్యా బాధితుల సంఘంలో చేరుతున్నారు. భార్యల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి భార్యా బాధితుల సంఘం అండగా నిలుస్తోంది. తాజాగా, భార్య బాధితుల సంఘానికి చెందిన సభ్యులు వినూత్న రీతిలో పూజలు నిర్వహించారు. తమను కష్టపెడుతున్న భార్యలు ఏడు సెకన్లు కూడా తమకు వద్దంటూ వాపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వట సావిత్రి పౌర్ణమి రోజును పురస్కరించుకుని సాధారణంగా మహిళలు పూజలు చేస్తుంటారు. ఏడు జన్మలకూ ఒక్కరే భర్తగా రావాలని కోరుకుంటారు. అయితే, మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన భార్యా బాధితుల సంఘం సభ్యులు ఇందుకు భిన్నంగా పూజలు నిర్వహించారు. వట సావిత్రి పౌర్ణమి రోజున ఏడు జన్మలకు కాదు కదా.. ఏడు సెకన్లు కూడా తమకు ఈ భార్యలు వద్దంటూ దేవుడ్ని వేడుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి, భార్యా బాధితుల సంఘం సభ్యుల వింత పూజలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Rafiq Adnan: 200కేజీల బరువు.. రోజుకు 15 కిలోల ఆహారం.. వండిపెట్టడానికి ఇద్దరు భార్యలు!