నేటితరం కొందరు యువత ఆవిష్కరణలపై ఆసక్తి కనబరుస్తుంది. రైతులు వ్యవసాయ మోటర్ల, వాహనాల మైలేజ్ వంటి మొదలు అనేక అంశాల్లో మరింత కొంతగా ఆలోచనలు సాగిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా తెలంగాణాకి చెందిన రాకేష్ అనే యువ ఇంజనీర్ కొత్త ఎలక్ట్రిక్ కారుని తయారు చేశాడు. ఈ కారు 30 రూపాయలతో 300 కిలోమీటర్లు ప్రయాణించేలా తయారు చేశాడు. ఇటీవల అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలో ఈ యువ ఇంజనీర్ కనిపెట్టిన కొత్తకారు అందరిని ఆకట్టుకుంటుంది. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల వేడుకలు ఖమ్మం జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పరేడ్ గ్రౌండ్ లో ఈ కారుని ప్రదర్శన కోసం రాకేష్ తీసుకొచ్చాడు. ఈ ఎలక్ట్రికల్ కారు చూడటానికి కొంచెం చిన్నగా ఉన్నా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం తీసుకెళ్తుంది. ఈ కారుని ఒక్కసారి ఛార్జీంగ్ చేస్తే చాలా దూరం వస్తుందంట. అయితే ఒక్కసారి ఛార్జీంగ్ కి కేవలం 5 నుంచి 10 యూనిట్ల వరకు విద్యుత్ అవసరమవుతుందట. 10 యూనిట్లు వాడినా కేవలం 30 రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుందని, ఇదీ చదవండి: రియల్ లైఫ్ అపరిచితుడు.. ఒకే మనిషిలో ఇంత మంది వ్యక్తులా?.. ఈ 10 యూనిట్ల విద్యుత్ తో దాదాపు 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చని రాకేశ్ వెల్లడించాడు. అవతరణ దినోత్సవాల భాగంగా పరేడ్ గ్రౌండ్ కి తీసుకురాగా ఈ ఎలక్ట్రిక్ కారుని మంత్రి పువ్వాడ అజయ్కుమార్, తదితర అధికారులు ఆసక్తిగా పరిశీలించి అభినందించారు. మరి.. ఈ యువ ఇంజనీర్ ఆవిష్కరించిన ఈ కొత్త ఎలక్ట్రక్ కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.