ప్రభుత్వాలు ఏదైనా కొత్త పథకాలు తీసుకొచ్చినప్పుడు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. అదీ కాక రాజకీయ నాయకులు కూడా ఆ పథకాల ప్రచార వ్యవహారాలలో కూడా స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కేంద్రం ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ ఫొటో దుకాణాలపై ఎందుకు పెట్టలేదని నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ని ప్రశ్నించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయం పై తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు మండలాల్లో రేషన్ దుకాణాలను పరిశీలించారు. అయితే బీర్కూర్ లో ఓ రేషన్ షాప్ ను పరిశీలించే క్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పై పలు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి దాక రేషన్ బియ్యాన్ని ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నప్పుడు రేషన్ షాప్ లపై మోదీ ఫొటో ఎందుకు ఉండకూడదు అంటూ ఇక నుంచి రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల కార్యక్రమాలపై మోదీ ఫొటో ఉండాలని నిర్మలా సీతారామన్ ఆదేశించారు. ఈ వ్యావహారంపై కేటిఆర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. నిన్న కలెక్టర్ తో నిర్మలా సీతారామన్ మాట్లాడిన తీరు నన్ను భయపెట్టిందని.. అలాగే బీజేపీ నాయకుల తీరుతో IAS అధికారులు భయపడుతున్నారని అన్నారు. కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను మీలాంటి రాజకీయ నాయకులు నిరుత్సాహపరుస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక ఈ విషయంలో గౌరవప్రదమైన కలెక్టర్ పాటిల్ ప్రవర్తనకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ నిధుల వాటాల విషయంలో గొడవలు పడుతూనే ఉంటాయని మనందరికి తెలిసిన విషయంమే. మరి ఈ నేపథ్యంలో కలెక్టర్ కు అండగా నిలిచిన కేటీఆర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. I am appalled by the unruly conduct of FM @nsitharaman today with District Magistrate/Collector of Kamareddy These political histrionics on the street will only demoralise hardworking AIS officers My compliments to @Collector_KMR Jitesh V Patil, IAS on his dignified conduct — KTR (@KTRTRS) September 2, 2022 ఇదీ కూడా చదవండి: ఇంగ్లీష్ మీడియంని అంతా వ్యతిరేకించినా.. సీఎం జగన్ మొండిగా ఎందుకు ముందుకి వెళ్లారు? ఇదీ కూడా చదవండి: Free Petrol: కొడుకు జ్ఞాపకార్థం ఫ్రీ పెట్రోల్ సరఫరా చేసిన తండ్రి..