డి.శ్రీనివాస్.. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ధర్మపురి ఫ్యామిలీకి, రాష్ట్ర రాజకీయాల్లో డీఎస్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. YSR ఉన్నప్పుడు ఆయనే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడి గా ఉండి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ను రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో డీఎస్ కీలకంగా వ్యవహరించారు. ప్రత్యర్ధులపై మాటల సంధించటంలో డీఎస్ దిట్టా. తాజాగా YSR తనయ YS షర్మిల పై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆమె ముఖ్యమంత్రి అవుతుందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల డి. శ్రీనివాస్ అనారోగ్యానికి గురయ్యారు. ఈక్రమంలో సోమవారం ఆయనను వైఎస్ షర్మిల పరామర్శించారు. డీఎస్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తి కరమైన చర్చ నడిచింది. వైఎస్సార్ తో ఉన్న పాత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. డీఎస్ తెలంగాణ ప్రజల్లో వైఎస్సార్ పై అభిమానం చెక్కు చెదరకుండా ఉందని గుర్తు చేశారు. సరైన టైంలో ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉండబోతుందని, షర్మిల ఒక పవర్ ఫుల్ లేడీ అని ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. "నా రాజకీయ అనుభవంతో చెప్తున్నాను.. భవిష్యత్తులో షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది" అంటూ డీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని 2003 లోనే తానే చెప్పానని గుర్తు చేసిన డీఎస్ భవిష్యత్ లో వైఎస్సార్ బిడ్డ తప్పక ముఖ్యమంత్రి అవుతుందని అన్నారు. మరి.. మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: రామ్ చరణ్పై KTR ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘బ్రదర్ నీ గురించి గొప్పగా వింటున్నా’ ఇదీ చదవండి: K T Rama Rao vs Y S Sharmila: కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూనే.వైఎస్ షర్మిల సెటైర్లు!