తెలంగాణలో గత కొంత కాలంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఏ చిన్న చాన్స్ దొరికినా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇటీవల కాంగ్రెస్ నాయకత్వంపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. బాల్క సుమన్ ఒక్కసారి నీ స్థాయి ఏంటో గుర్తు చేసుకో.. గల్లీలో గోలీలు ఆడుకునే బాల్క సుమన్ ఎంపీ అయ్యాడు.. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. అది ప్రజలకు నీకు ఇచ్చిన గౌరవం.. ఆ గౌరవాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు.. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో కాస్త గుర్తు పెట్టుకోవాలని అన్నారు. నీ స్థాయికి జాతీయ స్థాయిన నేత రాహూల్ గాంధీని విమర్శిస్తావా నీ బతుకు గురించి తెలుసుకొని ఎదుటి వారి గురించి మాట్లాడు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి నువు గెలుస్తావన్న నమ్మకం లేదు.. అందుకే నీ ఉనికి కాపాడుకునేందుకు ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేస్తున్నావంటూ నిప్పులు చెరిగారు. ఇక ముందు ఎవరి స్థాయి ఏంటో ఆలోచించి.. కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని కామెంట్స్ చేయాలని అన్నారు. అంతేకాదు బాల్క సుమన్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యింది కనుకనే నువు కనిపిస్తున్నావ్.. లేదంటే నీ ఉనికే లేదు అన్నారు. కనీసం వార్డు మెంబర్ పదవికి కూడా పనికిరాడు అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇది చదవండి: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన జేసీ దివాకర్రెడ్డి