రాజకీయాలలో ఆరోపణలు.. ప్రత్యారోపణలు సహజమే. కానీ కొన్ని కొన్ని సార్లు ఆ ఆరోపణలు తీవ్ర పరిణాలమాలకు దారి తీస్తాయి. ప్రస్తుతం అలాంటి పరిణామాలే తెలంగాణలో కనిపిస్తోన్నాయి. తాజాగా మునుగోడు సభకు హాజరైన కేంద్ర హూం మంత్రి అమిత్ షా చెప్పులు మోసినట్లు తనపై వస్తోన్న వార్తలపై బండి సంజయ్ స్పందించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం జనగామ జిల్లా మీదికొండ నుంచి మెుదలు అయింది. ఈ సందర్భంగా తనపై వస్తోన్న ప్రచారాన్ని బండి సంజయ్ తిప్పి కొట్టారు. చెప్పులు అందించిన విషయంపై మాట్లాడుతూ.. అమిత్ షా చెప్పులు మోసినందుకు నాకేం బాధ లేదు. ఆయన నాకు గురువుతో సమానం గురువు సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని.. ఈ విషయాన్ని తెలంగాణ ఆత్మగౌరవానికి ముడిపెడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాక్షస ఆనందాన్ని పొందుతున్నాయని మండిపడ్డారు. అలాగే తాను కేసీఆర్ లా ఇటలీ వాళ్ల కాళ్లు మెుక్కలేదా అని గుర్తు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి కూతురు కవిత అంశాన్ని జనాలు మర్చిపోవడానికే ఇలాంటి ప్రచారాన్ని టీఆర్ఎస్ చేస్తోందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కు కోవర్టుల్లా మారిపోయారని ఆరోపించారు. నోరు విప్పితే అబద్దాలు చెప్పే కేసీఆర్ కు గుజరాతీలకు గులాములు అయిపోయారని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. అవసరానికి వాడుకొని వదిలేయడంలో కేసిఆర్ తర్వాతే ఎవరైనా.. అలాంటి వ్యక్తి బీజేపీ గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని అని బండి సంజయ్ అన్నారు. మరి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: హ్యాపీ బర్త్ డే ఆంటీ అంటూ వరలక్ష్మి శరత్కుమార్ పోస్ట్.. ఫైరవుతున్న నెటిజన్లు..