కొందరు మహిళలు చేసే పనులు ఇతరులకు ఎంతో ఆదర్శంగా ఉంటాయి. మరెందరిలోనూ ధైర్యాన్ని నింపుతాయి. తాజాగా ఓ మహిళ చేసిన ధైర్య సాహసం అందరిని ఆశ్చర్యానికి గురిచేసేంది. ఓ దొంగ వచ్చి కళ్లకారం కొట్టి మెడలో గొలుసు లాక్కొని దొంగ బైకుపై పారిపోతుండగా వాహనం వెంబడించి ఆమె పట్టుకున్నారు. కాళ్లకు దెబ్బలు తగిలినా ఆమె పట్టు విడవలేదు. చివరకు ఇద్దరు యువకుల సహాయంతో అతణ్ని పోలీసులకు అప్పగించి ఆమె తెగువ చూపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం అప్పన్నగూడెం గ్రామానికి చెందిన సండ్ర శిరీష, నగేష్ దంపతులు హైదరాబాద్ లోని హయత్నగర్ లో నివసిస్తున్నారు. వీరు ఉంటున్న ఇంటి ప్రక్కనే మరో రెండు సింగిల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో వాటికి ఇంటి యజమాని భిక్షమయ్య టు-లెట్ బోర్డు పెట్టారు. అయితే ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి మొదటి అంతస్తుకు చేరుకొని అద్దెకు ఇల్లు కావాలంటూ శిరీషను అడిగాడు. దీంతో ఆమె ఆ రూమ్ చూపించి తిరిగి తాళం వేస్తుండగా.. ఆమె కళ్లలో కారం కొట్టి మెడలోని బంగారు గొలుసును లాక్కొని కిందకు పరుగు తీశాడు. ఆమె అతడిని వెంబడించారు. అతడు బైక్ ఎక్కి వెళ్తుండగా ఆమె ద్విచక్రవాహనాన్ని గట్టిగా పట్టుకుంది. అలాగే ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. అయినా ఆమె బైక్ ను వదలకుండా పట్టుకోవడంతో పాటు వెనక్కు లాగడంతో అతడు కింద పడ్డాడు. ఇది గమనించిన ఇద్దరు యువకులు ఆమెకు సహకారం అందించారు. దీంతో దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బైక్ ఈడ్చుకెళ్లడంతో శిరీష మోకాళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు బంగారు గొలుసును శిరీషకు అందజేశారు. శిరీష చూపించిన తెగువకు స్థానికులు అభినందనలు తెలియజేశారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: వీడియో: వరద నీటిలో కొట్టుకుపోయిన మహిళా టీచర్.. కాపాడిన స్థానికులు.. ఇదీ చదవండి: వీడియో : గోడపై వ్రేలాడుతున్న కారు!