ఒకప్పుడు కారు ఉంది అంటే అది హోదాకు చిహ్నంగా భావించేవారు. నేడు కారు చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా అవసరానికి పనికొస్తుందా లేదా అన్నదానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకే.. ఒకప్పుడు ద్విచక్ర వాహనాలు ఉన్న స్థితిలో ప్రస్తుతం కార్ల విభాగం ఉంది. అందులోనూ.. కారు మార్చే వారి కంటే తొలిసారి కారు కొనేవారే అధికం. ఈ తరుణంలో కార్ల కంపనీలు కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు ఆపర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఎంట్రీ లెవల్, చిన్న కార్లపై డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో దిగ్గజ సంస్థలు సైతం పోటీ పడుతుండటం విశేషం. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, రెనాల్ట్ తమ కార్లను తక్కువ ధరల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆ వివరాలేంటో చూద్దాం.. మారుతి సుజుకి: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం.. మారుతి సుజుకి కొన్ని మోడల్లు రూ. 50,000 వరకు భారీ డిసీసౌంట్లతో పాటు, క్యాష్ ఎక్స్ఛేంజ్ బోనస్లు ప్రకటించింది. అలాగే.. మారుతి ఎస్-ప్రెస్సో, ఆల్టో800, స్విఫ్ట్, సెలెరియో.. వంటి ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 9,000 - రూ. 60,000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. అన్ని మోడల్లు కూడా ఎక్స్ఛేంజ్ బోనస్ లభ్యం. రెనాల్ట్ ఇండియా: కస్టమర్లను ఆకర్షించడంలో రెనాల్ట్ ఇండియా ఈసారి ముందు వరుసలో ఉంది. క్విడ్ హ్యాచ్బ్యాక్, ట్రైబర్ ఎంపీవీ, కిగర్ కాంపాక్ట్ ఎస్ యూవీ తదితర మోడళ్లపై రూ. 60,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇంకా నగదు తగ్గింపులు, స్క్రాపేజ్ ప్రయోజనాలు ,ఎక్స్ఛేంజ్ బోనస్లతో కూడా అందిస్తోంది. అంతేకాదు.. ప్రత్యేక ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్ కింద రూ. 5,000 విలువైన యాక్సెసరీలు ఉచితం అని ప్రకటించింది. టాటా మోటార్స్: టాటా మోటార్స్ మోడళ్ల వారిగా 20- 40వేల రూపాయల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. ప్రధానంగా టాటా టియాగో, టైగోర్, నెక్సాన్, సఫారీ.. వంటి మోడళ్లపై రూ.40 వేల వరకు తగ్గింపు ఉండనుంది. అలాగే ఓనం పండుగ సందర్భంగా కేరళ వాసుల కోసం బంపర్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హ్యుందాయ్: దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుందాయ్ సాంట్రో, ఐ10 నియోస్, ఔరా, ఐ20, కొనా ఈవీ.. వంటి మోడల్స్ పై సుమారు రూ.13 వేల నుంచి రూ.50 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, అదనపు ఇన్సెంటివ్లు అందించనుంది. మహీంద్రా సంస్థ కూడా ఎక్స్యూవీ 300, బొలెరో, బొలెరో నియో వంటి మోడల్ కార్లపై పలు ఇన్సెంటివ్లు, ఆఫర్లు ప్రకటించింది. గత నాలుగు నెలలతో పొలిస్తే.. ఎంట్రీ లెవల్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు పుంజుకుంటున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి వెల్లడించారు. దీనికి అనుగుణంగా ప్యాసింజర్ వెహికల్ ఒరిజినల్-ఎక్విప్మెంట్ తయారీదారులందరూ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా తమ సరఫరాలను రీకాలిబ్రేట్ చేయాలని కోరారు. ఒకవేళ.. మీకు కారు కొనాలనే కోరిక ఉంటే .. మీకు నచ్చిన కారు కొనేయడానికి ఇదే సరైన సమయం. డిస్కౌంట్లు, ఆఫర్లు విషయమై.. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆయా సిబ్బందిని సంప్రదించండి. ఇదీ చదవండి: వోల్వో తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు XC40 లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 418 కి.మీ! ఇదీ చదవండి: Kia EV6: సూపర్బ్ లుక్, అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటున్న కియా ఎలక్ట్రిక్ కార్..!