మీ ఇంట్లో 'సన్న పిన్ ఛార్జర్ ఉందా?' పదేళ్ల క్రితం ఈ మాట అడిగేవాళ్లం. మరి ఇప్పుడు.. మీ ఇంట్లో ఐఫోన్ ఛార్జర్ ఉందా? సీ- టైప్ ఛార్జర్ ఉందా? అని అడుగుతున్నాం. అప్పటకీ, ఇప్పటికీ ఇదీ తేడా. నాలుగేళ్లు గడిచేసరికి కొత్త చార్జర్ కోసం వెతొక్కోవాల్సిన పరిస్థితి. అలా కాకుండా అన్ని ఫోన్స్కూ ఒకటే ఛార్జర్ పనిచేస్తే? ఎంత బాగుంటుంది కదా! అవును.. కేంద్రం ఈ ప్రశ్నకు జవాబు వెతికే పనిలో ఉంది. ఈ మేరకు ఈ నెల 17న టెక్ కంపెనీలతో సమావేశం నిర్వహించనుంది. 2024 నుంచి అన్ని డివైజ్లకు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ స్టాండర్డ్గా ఉండాలని యూరోపియన్ యూనియన్ అన్ని కంపెనీలను ఆదేశించింది. ప్రస్తుతం అమెరికాలోనూ ఇలాంటి డిమాండే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా ఓ అడుగు ముందుకు వేసి.. "వన్ నేషన్ వన్ చార్జర్" విషయంపై కంపెనీలకు ప్రతిపాదన పంపింది. ప్రస్తుతం.. సెల్ ఫోన్ కు ఒక చార్జర్, ల్యాప్ టాప్ కు ఒక చార్జర్, స్మాట్ వాచ్ కు ఒక చార్జర్.. అంటూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు వేరు వేరు ఛార్గర్లు వాడుతున్నాం. దీని వల్ల ఈ-వేస్టేజ్ అంతకంతకూ పెరుగుతోంది. అందులోనూ.. ఇప్పుడు చాలా కంపెనీలు కొత్త ఫోన్ కొనుగోలు చేసినా ఛార్జర్ను ఇంతకుముందులా ఉచితంగా ఇవ్వడం లేదు. విడిగా కొనుక్కోవాల్సిందే. ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న వ్యక్తి ఐఫోన్ కొంటే.. లైట్నింగ్ పోర్ట్ ఛార్జర్ కోసం అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సిందే. ఈ వేర్వేరు ఛార్జర్ల విధానం.. వినియోగదారులకు ఆర్థికంగా కూడా భారమవుతోంది. అందుకే.. స్మార్ట్ఫోన్లు, వాచ్ లు, ల్యాప్ టాప్ లు ఇంకా ట్యాబ్లెట్లు వంటి అన్ని గ్యాడ్జెట్లకు కామన్గా ఒకే చార్జర్ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ అంశంపై మొబైల్స్ తయారీ సంస్థలు సహా పరిశ్రమ వర్గాలతో ఆగస్టు 17న సమావేశం కానుంది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి వివరాలు వెల్లడించారు. "వన్ నేషన్ వన్ చార్జర్" పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ఇకపై కెమెరా అవసరం లేదు.. ప్రపంచంలోనే బెస్ట్ కెమెరా ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే? ఇదీ చదవండి: Oppo: స్మార్ట్టీవీ మార్కెట్ లో సంచలనం.. 15 వేల ధరలో 50 ఇంచెస్ స్మార్ట్టీవీ!