ఇండియా టూర్ ఆఫ్ జింబాంబ్వే-2022లో తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శనివారం జరుగుతున్న రెండో వన్డేలోనూ భారత్ విజయం ఖాయమనే చెప్పాలి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. కేవలం 161 పరుగులకే జింబాంబ్వే ఆటగాళ్లను కట్టడి చేశారు. షాన్ విలియమ్స్(42), ర్యాన్ బర్ల్(39) తప్ప మరే ఆటగాడు ప్రభావం చూపలేకపోయారు. ఈ మ్యాచ్ లోని తొలి ఇన్నింగ్స్ లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఇషాన్ కిషన్పై అక్షర్ పటేల్ కోపంతో ఊగిపోయాడు. సారీ చెప్తున్నా కూడా తిట్ల దండకం అందుకున్నాడు. అయితే అందుకు ఓ బలమైన కారణమే ఉందిలెండి. ఇషాన్ కిషన్ చేసిన పనికి అక్షర్ పటేల్కు పెద్ద ప్రమాదమే తప్పింది. అందుకే క్షమాపణ చెప్తున్నా కూడా అక్షర్ మాత్రం తిట్లు అందుకున్నాడు. విషయం ఏంటంటే.. 28వ ఓవర్లో దీపక్ హుడా బౌలింగ్ చేస్తున్నాడు. ఆఫ్ స్టంప్కు బయటపడిన బంతిని జింబాంబ్వే బ్యాట్స్ మన్ బర్ల్ బ్యాక్ ఫుట్ పై డీప్ ఎక్స్ ట్రా కవర్ వైపు కొట్టాడు. బౌండరీ పైనున్న ఇషాన్ కిషన్ బంతిని కీపర్ కు త్రో చేశాడు. కానీ, చెయ్యి జారిపోయి.. అక్షర్ పటేల్కు తాకపోయింది. ర్యాన్ బర్ల్ సైగచేయడంతో అక్షర్ పటేల్ వెంటనే తప్పుకున్నాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ వైపు కోపంగా చూస్తూ ఊగిపోయాడు. ఇషాన్ కిషన్ మాత్రం సారీ చెప్తూ వెళ్లిపోయాడు. ఈ మూమెంట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. pic.twitter.com/0hPz8OOg9r — Richard (@Richard10719932) August 20, 2022 ఇదీ చదవండి: వీడియో: జింబాబ్వే ఫ్యాన్ చిరు కోరిక! దీపక్ చాహర్ ఏం చేశాడో తెలుసా..? ఇదీ చదవండి: ప్రేమ, పెళ్లిపై స్పందించిన పీవీ సింధు.. ఏమందంటే!..