క్రికెట్ ప్రపంచంలో విధ్వంసక ఓపెనర్ ఎవరు..? అంటే ఫస్ట్ వినిపించే పేరు వీరేంద్ర సెహ్వాగ్. టెస్టులను వన్డేల్లా, వన్డేలను టీ20ల్లా ఆడడమే తన స్పెషాలిటీ. ఫార్మాట్ ఏదైనా.. బౌలర్ ఎవరైనా.. మ్యాచ్ గమనంతో సంబంధం లేకుండా కెరీర్ సాంతం ఒకే తరహాలో దూకుడుగా ఆడేవాడు. ఈ దూకుడే సెహ్వాగ్ ను క్రికెట్లోనే తనదైన ముద్ర వేసేలా చేసింది. సెహ్వాగ్లోని ఆ దూకుడుని తొలుత పసిగట్టింది మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కాదట. ఓ బౌలరట. ఈ విషయాన్ని సెహ్వాగ్ స్వయంగా వెల్లడించాడు. "మిడిలార్డర్ నుంచి మీరు ఓపెనర్గా ఎలా మారారు..? అని నన్ను తరచూ అందరూ అడుగుతుంటారు. అలా నేను ఓపెనర్గా మారడంలో సౌరవ్ గంగూలీది కీలకపాత్ర. అయితే.. ఆ ఆలోచన మాత్రం అతనిదికాదు.. జహీర్ ఖాన్ది. 1999లో నేను మిడిల్ ఆర్డర్ బ్యాటర్ని. మొట్టమొదటిసారి నిన్ను (షోయబ్ అక్తర్ని) ఫేస్ చేసినప్పుడు కూడా నేను మిడిల్ ఆర్డర్లోనే బ్యాటింగ్కి వచ్చా. నా బ్యాటింగ్ స్టైల్ చూసిన జహీర్ ఖాన్, ఓపెనర్గా నేను సెట్ అవుతానని సౌరవ్ గంగూలీకి సలహా ఇచ్చాడు. గంగూలీ కూడా ఆ సలహాని గౌరవించి, ఓపెనర్గా పంపాడు. ఆ పొజిషన్లో సక్సెస్ అయ్యా.." "ఫస్ట్ దాదా నన్ను ఓపెనింగ్ చేయమన్నప్పుడు.. నువ్వెందుకు ఓపెనర్ ఆడకూడదు? సచిన్ని ఓపెనర్గా పంపిచొచ్చు కదా? అని అడిగా. కానీ, దాదా మాత్రం సింపుల్గా ప్రస్తుతం ఓపెనర్ స్థానం ఖాళీగా ఉంది. నీకు మూడు నాలుగు ఇన్నింగ్స్ల్లో అవకాశమిస్తా.. ఒకవేళ నువ్వు ఫెయిలైతే..? నిన్ను జట్టు నుంచి తప్పించే ముందు మళ్లీ మిడిలార్డర్లో ఓ అవకాశమిస్తా అని భరోసా కూడా ఇచ్చాడు. ఆ సలహా నాకు బాగా నచ్చింది అని చెప్పుకొచ్చాడు". ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు వీరేంద్ర సెహ్వాగ్, షోయబ్ అక్తర్ కలిసి స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ స్పెషల్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కామెంట్లు చేశాడు సెహ్వాగ్. వెల్లడించాడు. Virender Sehwag recalls how Zaheer Khan suggested Sourav Ganguly to promote Sehwag to the opening spot.#VirenderSehwag #ZaheerKhan #VirenderSehwag #India #IndianCricketTeam #TeamIndia #Cricket #Sportsbettingmarkets pic.twitter.com/dDoEjk5Oy9 — Sportsbettingmarkets.com (@Sbettingmarkets) August 19, 2022 వీరేంద్ర సెహ్వాగ్ అంటేనే విధ్వంసానికి పెట్టింది పేరు. బరిలోకి దిగాడంటే చాలు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఫామ్లో ఉంటే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఆరంభం నుంచే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ బౌలర్లను మానసికంగా దెబ్బతీస్తాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ వంటి క్రికెటర్లు 90+ దాటిన తర్వాత సెంచరీ పూర్తి చేసుకోవడానికి నెమ్మదిగా ఆడేవాళ్లు. సెహ్వాగ్ మాత్రం 94 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్సర్ కొట్టి, సెంచరీ మార్కు అందుకునేవాడు. టీమిండియా తరుపున రెండు త్రిబుల్ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్గా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్. 104 టెస్టుల్లో 49.3 సగటుతో 8586 పరుగులు చేశాడు. టెస్టుల్లో వీరూ స్ట్రైయిక్ రేటు 82.2గా ఉండగా, వన్డేల్లో 104.3గా ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్లో 251 మ్యాచులు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ 35 సగటుతో 8273 పరుగులు చేశాడు. ఇదీ చదవండి: Sachin Tendulkar: షాహిద్ ఆఫ్రిది పదే పదే తిడుతుంటే.. సచిన్ ఏం చేశాడంటే: సెహ్వాగ్ ఇదీ చదవండి: Vinod Kambli: ఒకప్పుడు సచిన్ని మించిన ఆటగాడు! ఇప్పుడు దీనస్థితిలో! వినోద్ కాంబ్లీ అసలు కథ!