టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్లేమితో పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్తో జరిగిన వన్డే, టీ20 సిరీస్ తర్వాత వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్లకు కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. తిరిగి ఈ నెల 28న పాకిస్థాన్తో ఆసియాకప్లో జరిగిన మ్యాచ్తో కోహ్లీ జట్టులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో తనపై ఒత్తిడి గురించి విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. భావోద్వేగానికి గురయ్యాడు. ఒక ఆటగాడిపై నిరంతరం ఉండే ఒత్తిడి అతని మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అన్నాడు. అలాగే తనపై ఒత్తిడి కారణంగా.. ఒక గదిలో తనను ప్రేమించే వారు ఉన్నా కూడా తాను ఒంటరిగా ఫీలైనట్లు కోహ్లీ వెల్లడించాడు. ‘నాకే కాదు ఒక అథ్లెట్పై ఒత్తిడి అతని మానసిక ఆరోగ్యానికి ప్రతికూలంగా పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన సమయాన్ని మంచిగా విభజించి వినియోగించుకోవాలి. కుటుంబంతో గడపటం, మనసుకు నచ్చిన పనులు చేయాలి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు ట్రావెలింగ్ నాకు ఎంతో హెల్ప్ చేసింది. అలాగే కుటుంబంతో గడపటం కూడా మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. మనం ఏం పని చేస్తున్న దాన్ని ఎంజాయ్ చేయాలి. అప్పుడే ఒత్తిడి అనేది ఉండదు.’ అని కోహ్లీ పేర్కొన్నాడు. తన అసాధారణ బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్లో తన కంటే ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న కోహ్లీ.. టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు వదిలేయడం, భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోవడం అతనిపై ఒత్తిడి పెంచింది. ఐపీఎల్ 2022లో రెండు మ్యాచ్ల్లో వరుసగా డకౌట్ అయిన సమయంలో కోహ్లీ తీవ్ర నిరాశకు గురవుతున్న విషయం అతన్ని మైదానంలో చూసిన ప్రతి క్రికెట్ అభిమానికి సైతం అర్థం అయి ఉంటుంది. మరి కోహ్లీ మానసిక ఒత్తిడిపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ️'The amount of pressure that you are constantly under, can affect your mental health negatively' - Virat Kohli added#AsiaCup2022 #Cricket #ViratKohli pic.twitter.com/0htoCIyww5 — CricTracker (@Cricketracker) August 17, 2022