ఇంగ్లాండ్ పై టీ20 సిరీస్ నెగ్గిన రోహిత్ సేన ఇప్పుడు వన్డే సిరీస్ కు సిద్ధమవుతోంది. అయితే కోహ్లీ, టీమిండియా ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఓవల్ వేదికగా జరగనున్న తొలి వన్డేకి విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లీకి మూడో టీ20లో గజ్జల్లో గాయం అయిందని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ లో ఎప్పుడు, ఎలా గాయం అయ్యిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ గాయం కారణంగానే విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో తొలి వన్డేకి దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే 14, 17 జరగబోయే రెండు, మూడో వన్డేలకు కోహ్లీ అందుబాటులో ఉంటాడని సమాచారం. మూడో టీ20లో అయిన గాయం తీవ్రత ఎంతనేది తెలియరాలేదు. కానీ, కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. On to the #ENGvIND ODIs, starting tomorrow! #TeamIndia pic.twitter.com/NWz3UBc2m9 — BCCI (@BCCI) July 11, 2022 మెడికల్ చెకప్ కోసమే కోహ్లీ నాటింగ్ హామ్ నుంచి టీమ్ తో కలిసి బస్సులో లండన్ రాలేదని చెబుతున్నారు. నెట్స్ లో కూడా శిఖర్, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణలు మాత్రమే ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఇంక ఇంగ్లాండ్ తో సిరీస్ తర్వాత టీమిండియా నేరుగా వెస్టిండీస్ వెళ్లనుంది. ఆ సిరీస్కి విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ కోహ్లీని కోరినట్లు సమాచారం. అయితే అది విశ్రాంతా? జట్టు నుంచి తప్పించే ప్రయత్నమా అనేది మాత్రం నిలకడ మీద తెలిసే అవకాశం ఉంది. కోహ్లీ తొలి వన్డేకి దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Some #BREAKING News Senior batter Virat Kohli has sustained a groin strain during the 3rd T20I vs England in Birmingham. He could miss the first ODI at the Oval on Tuesday.#INDvsENG #IndianCricketTeam #CricketTwitter — Kushan Sarkar (@kushansarkar) July 11, 2022 ఇదీ చదవండి: విషాదం.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కన్నుమూత! ఇదీ చదవండి: 11 ఏళ్ల క్రితమే సూర్యకుమార్ యాదవ్ సత్తా కనిపెట్టిన రోహిత్ శర్మ.. ఓల్డ్ ట్వీట్ వైరల్!