టీమిండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్లో కూడా కోహ్లీని ఆరాధించే వారునున్నారు. అంతే కాదు.. ఏకంగా పాకిస్థాన్ జట్టులోనే విరాట్ కోహ్లీని విపరీతంగా అభిమానించే క్రికెటర్ ఉన్నాడు. మైదానంతో ప్రత్యర్థులమైనా, తమ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా.. నేను మాత్రం కోహ్లీకి అభిమానినే అని చెప్తున్నాడు పాక్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్. ఆసియా కప్లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్థాన్ జట్లు తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో పాక్ను చిత్తుచేసి ఆసియా కప్ వేటను ఘనంగా ఆరంభించింది. చాలా కాలంగా ఫామ్లో లేని కోహ్లీ.. పాక్తో మ్యాచ్లో కొంత టచ్లోకి వచ్చాడు. 35 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం హరిస్ రౌఫ్ తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీని కలిసి చాలా సేపు ముచ్చటించాడు. కోహ్లీ కూడా రౌఫ్తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. కోహ్లీని ఎంతో అభిమానించే రౌఫ్.. ఆటోగ్రాఫ్ చేసిన తన జెర్సీ కావాలని కోహ్లీని కోరడంతో.. కోహ్లీ సంతకం చేసిన తన జెర్సీని రౌఫ్కు అందిస్తాడు. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ను రౌఫ్ ఎంతో సంతోషంతో స్వీకరించాడు. జెర్సీ అందుకున్న సమయంలో అతని ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఎంతో ఆనందంతో దాన్ని తీసుకుని వెళ్లాడు. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది. పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోహ్లీపై అభిమానానికి దేశాలు, సరిహద్దులు, శత్రుత్వం అడ్డుకాదని కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. కాగా.. టీమిండియా ఆటగాళ్లను కలిసేందుకు వారిపై తమ అభిమానం చూపించేందుకు దుబాయ్లోని పాకిస్థాన్ అభిమానులు ఎగబడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా పాక్ క్రికెటరే కోహ్లీని ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీ కోరడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కాగా.. గతేడాది టీ20 వరల్డ్ కప్లో తలపడ్డ దాయాదులు.. మళ్లీ ఇన్ని రోజులకు ఆసియా కప్లో ఢీకొన్నాయి. టీ20 వరల్డ్ కప్లో పాక్ గెలిస్తే.. ఇప్పుడు టీమిండియా గెలిచ లెక్కసరిచేసింది. కాగా.. మళ్లీ ఈ రెండు జట్లు ఈ టోర్నీలోనే తలపడే అవకాశం ఉంది. ఇది నిజంగా క్రికెట్ అభిమానులకు మంచి కిక్కించే విషయం. ప్రస్తుతం లీగ్ దశలో తలపడిన ఈ రెండు జట్లు ఫైనల్లో లేదా, సూపర్ ఫోర్లో తలపడే అవకాశం ఉంది. అలాగే అక్టోబర్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2022లో కూడా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. మరి ఈ రెండు దేశాల మధ్య పోరంటే క్రికెట్ అభిమానులు ఎక్కడలేని ఆసక్తి చూపిస్తారు. లీగ్ మ్యాచ్తోనే హాట్స్టార్లో అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్గా రికార్డు సృష్టించింది. ఇక ఆసియా కప్ ఫైనల్లో తలపడినా, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్లో ఢీకొన్న ఈ కొత్త రికార్డు చెరిగిపోవడం ఖాయం. మరి ఇండియా-పాకిస్థాన్ రైవల్రీ, పాక్ ప్లేయర్ రౌఫ్కు కోహ్లీ జెర్సీ గెఫ్ట్గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: అంతా హార్దిక్ పాండ్యాని పొగుడుతున్నారు. కానీ.., అసలు హీరో కోహ్లీనే! Nice gesture from Virat Kohli to gift a signed jersey to Haris Rauf. pic.twitter.com/QwnD7Q3Qrw — Johns. (@CricCrazyJohns) August 29, 2022