ఆసియాకప్ అయిపోయింది. అస్సలు అంచనాల్లేని శ్రీలంక జట్టు కప్పు ఎగురేసుకుపోయింది. ఫైనల్లో పాకిస్థాన్ జట్టుని చిత్తుగా ఓడించింది. ఆరోసారి ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. బ్యాటింగ్ లో లంక కుర్రాళ్లు అదరగొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ ఈ జట్టుని పొగుడుతున్నారు. కానీ ఇదే మ్యాచ్ లో లంక బౌలర్.. ఘోరంగా బౌలింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. ఇక దుబాయిలో ఆదివారం ఫైనల్ జరిగింది. పాక్ జట్టుని 23 పరుగుల తేడాతో శ్రీలంక ఓడించింది. ఈసారి ఛాంపియన్ గా అవతరించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. భానుక రాజపక్స 45 బంతుల్లో 71 పరుగులు చేసి.. లంక ఇన్నింగ్స్ కి వెన్నెముకగా నిలిచాడు. అతడితో పాటు హసరంగ 21 బంతుల్లో 36 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.ఇక లక్ష్య ఛేదనలో పాక్ జట్టు బ్యాటింగ్ ప్రారంభింది. తొలి బంతి వేసే సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లంక పేసర్ మధు శంక.. మొదటి బంతికే ఏకంగా 10 పరుగులిచ్చాడు. అదేంటి ఒకేసారి అన్ని రన్స్ ఎలా ఇచ్చాడనుకుంటున్నారా... ఫస్ట్ నో బాల్ వేశాడు. దీంతో ఫ్రీ హిట్ లభించింది. ఆ తర్వాత వరసగా నాలుగు వైడ్స్ వేశాడు. ఇందులో ఓ వైడ్, ఫోర్ గా వెళ్లిపోయింది. దీంతో అసలు ఒక్క బంతి కూడా పడకుండానే ఏకంగా స్కోరు బోర్డుపై 9 పరుగులు వచ్చాయి. ఇక ఫ్రీ హిట్ ని సింగిల్ గా తీయడంతో ఫస్ట్ బంతికే ఏకంగా 10 పరుగులు వచ్చినట్లయింది. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్ వస్తున్నాయి. కప్పు గెలిచారు సరే ఆ బౌలింగ్ ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. మరి మధుశంక బౌలింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి. ఇదీ చదవండి: పాక్ కొంపముంచిన క్యాచ్ డ్రాప్! తిట్టిపోస్తున్న పాకిస్థాన్ ఫ్యాన్స్! 6th title ✅ https://t.co/5Mvot46Omm pic.twitter.com/uks6F2YTgw — Sri Lanka Cricket (@OfficialSLC) September 11, 2022