ఆసియా కప్ 2022.. ఎక్కడ చూసినా భారత్-పాక్ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాక్ ప్రతీకారం తీర్చుకుంది. గత వారం ఓటమికి ఈ వారం బదులు తీర్చుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు.. తర్వాత మాజీ క్రీడాకారులు తమదైన శైలిలో ఆటపై స్పందిస్తూంటారు. ఇదే కోవలో షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ లో మ్యాచ్ ల గురించి విశ్లేషణాత్మకంగా వివరిస్తూంటాడు. తాజాగా జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్ గురించి కూడా తనదైన శైలిలో భారత్ పై విమర్శలు గుప్పిస్తూనే పాకిస్తాన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్ -4 మ్యాచ్ లో భారత్ పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత జట్టు చేసిన తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పై పాక్ ఫాస్ట్ బౌలర్ రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అభిప్రాయాలను తెలిపాడు. షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.." అసలు ముందు మీరు భవిష్యత్తులో భారత్ కు ఆడబోయే 11 మంది ఆటగాళ్లను సెలక్ట్ చేయండి. మీ సెలక్షన్ చెత్తగా ఉంది. అసలు మీకు ఎంపిక చేయడం వస్తుందా అనే అనుమానం కలుగుతోంది. అసలు మీ భవిష్యత్ ఆటగాళ్లు ఎవరు? రిషబ్ పంతా? దినేష్ కార్తీక్.. దీపక్ హుడా లేదా రవి బిష్ణోయ్ ఎవరు? ఎంపికలో మీరు ఎందుకు తికమక పడుతున్నారో నాకర్థం కావట్లేదు". ఇక మీరు ప్రయోగాలు చేస్తూ ఏకంగా 30 మంది ఆటగాళ్లను, వారి స్థానాలను మార్చారు. కింగ్ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం భారత్ కు సానుకూల అంశం. అతడు అద్భుతంగా ఆడి రెండు అర్దశతకాలు సాధించాడు. అయితే భారత్ బ్యాటర్లు ఈ మ్యాచ్ లో రాగానే భారీ షాట్లు ఆడడానికి ప్రయత్నించారు. అది చాలా పెద్ద పొరపాటు. ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే.. "మహ్మద్ నవాజ్ అద్బుతంగా ఆడి పాక్ కు విజయాన్ని అందించాడు". అతడిని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు పంపి బాబర్ మంచి ప్రయోగం చేశాడు. ఆ నిర్ణయం చాలా మంచిది. రిజ్వాన్ ఆట అంత సంతృప్తికరంగా లేనప్పటికీ అతడు అతడు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మెుత్తానికి పాక్ జట్టు అమోఘంగా ఆడింది. మహ్మద్ నవాజ్ 42 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్ కూడా చాలా పొదుపుగా వేసి ఓ వికెట్ ను సైతం అతడు తీసుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు నవాజ్ అర్హుడు. ఈ క్రమంలో ఇండియా తర్వాత శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ లపై తప్పక గెలవాలి. ఏది ఏమైనప్పటికీ భారత్ ను నిర్దాక్ష్యణ్యంగా పాక్ ఓడగొట్టిందని" స్పీడ్ గన్ షోయబ్ అక్తర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. ప్రస్తుతం అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అక్తర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Asia Cup 2022: టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ ప్లాన్ను కాపీ కొట్టి గెలిచిన పాకిస్థాన్! ఇదీ చదవండి: ఒక్క ఓటమితో కుంగిపోవద్దు.. టీమిండియాకు విజయశాంతి సపోర్ట్!