బ్యాటింగ్, బౌలింగ్ పరంగా మ్యాచ్ను మలుపు తిప్పే ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న షాబాజ్ అహ్మద్.. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో అతని స్థానంలో షాబాజ్ అహ్మద్ ఎంపికయ్యారు. ఎంపికైన సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో క్రికెట్ ఆడే ప్రతీ ఒక్కరూ భారత్ తరపున ఆడాలని కోరుకుంటారని, భారత జట్టుకు ఎంపికవ్వడమే తన కల అని, అది నేడు నెరవేరిందని అన్నారు. బెంగాల్ తరపున ఆడినప్పుడు సాధ్యమైనంత ప్రదర్శన కనబరిచానని అన్నారు. బెంగాల్ జట్టు నాపై ఎంతో నమ్మకం ఉంచిందని, ఒక్క అవకాశం ఇస్తే.. బ్యాటింగ్, బౌలింగ్తో భారతను గెలిపిస్తానని అన్నారు. ఆయన కోరుకున్నట్టే భారత్ను గెలిపించే అవకాశం దొరికింది. తొలిసారిగా భారత జట్టుకు షాబాజ్ ఎంపికవ్వడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 27 ఏళ్ళ ఈ ఆల్రౌండర్ బెంగాల్ తరపున దేశవాళీ మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. లిస్ట్-A క్రికెట్లో ఇప్పటికే 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో 47.3 సగటుతో అత్యుత్తమ ప్రదర్శనతో రాణించారు. ఐపీఎల్ 2022లో ఆర్సీబీ తరపున ఆడిన 11 ఇన్నింగ్స్లలో 27.38 సగటుతో 219 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మిడిల్ ఆర్డర్లో కీలకమైన పరుగులు చేసి జట్టుకి సహకరించడమే కాకుండా బౌలింగ్లో 4 వికెట్లు తీసి సత్తా చాటారు. మరి జింబాబ్వే పర్యటనకు భారత జట్టులో షాబాజ్ అహ్మద్ ఎంపికవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Shahbaz Ahmed has received his maiden call-up to the Indian squad as Washington Sundar’s replacement for the upcoming 3️⃣-match ODI series against Zimbabwe. Can’t wait to see you in #TeamIndia colours, Shahbaz. #PlayBold #ZIMvIND pic.twitter.com/4SjD7jkpef — Royal Challengers Bangalore (@RCBTweets) August 16, 2022 ఇది కూడా చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ ఫాలోయింగ్ చూస్తే మెంటలే..