ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ టూర్లో ఉన్న విషయం తెలిసిందే. వెంటనే జింబాబ్వే టూర్ ఆ తర్వాత ప్రతిష్టాత్మక ఆసియా కప్లో టీమిండియా ఆడనుంది. కాగా ఈ టోర్నీకి సంబంధించి ఒక ప్రమోషనల్ వీడియోను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కనిపిస్తాడు. భారత అభిమానుల అందించే ప్రొత్సామంతోనే తాము ముందుకెళ్తామని, ఏడుసార్లు ఆసియా కప్ గెలిచినా.. ప్రపంచ నంబర్ వన్ టీమ్గా ఎదిగినా.. స్టేడియంలో అభిమానులు ‘ఇండియా.. ఇండియా..’ అంటూ ఇచ్చే మద్దతే తమనెంతో గర్వపడేలా చేస్తాయని రోహిత్ పేర్కొన్నాడు. అభిమానులిచ్చే బలంతో ప్రపంచాన్ని గెలుస్తామని.. అంతకంటే ముందు ఆసియా కప్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిద్దాం రండి అంటూ పిలుపునిచ్చాడు. క్రికెట్ ఫ్యాన్స్ చూపించే ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్లో టీమిండియా తన తొలి మ్యాచ్ను 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసిక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆసియా కప్ను ఏడుసార్లు గెలిచిన టీమిండియా ఎనిమిదో సారి కప్ కొట్టేందుకు పట్టుదలతో ఉంది. కాగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం, విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం టీమిండియాకు ఎంతో అవసరం. ఆసియా కప్ తర్వాత భారత్ స్వదేశంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో సిరీస్లు ఆడనుంది. ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. టీ20 వరల్డ్ కప్తో ప్రపంచాన్ని గెలుస్తాం అంతకంటే ముందు ఆసియా కప్ను గెలవాలి అనే ఉద్దేశంతో రోహిత్ ప్రమోషనల్ వీడియోలో పేర్కొన్నాడు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. The fans make us who we are. For this pride, thank you India. Forever grateful for your support. #BelieveInBlue and tune-in to @StarSportsIndia as we aim to bring home the #AsiaCup2022 .#Ad pic.twitter.com/nUXkkYYMSz — Rohit Sharma (@ImRo45) August 4, 2022 ఇది కూడా చదవండి: నువ్వేమన్నా ధోని అనుకుంటున్నావా..! రోహిత్పై ఫ్యాన్స్ ఫైర్