టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా సోలంకి చేసిన ఒక మంచి పనికి ప్రధాని మోదీ ఫిదా అయ్యారు. దీంతో ఆమెను అభినందిస్తూ.. ఒక లేఖ రాశారు. ఈ లేఖను జడేజా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం మోదీ పంపిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా జడేజా భార్య తన ముద్దుల కూతురు ‘నిధ్యాన జడేజా’ ఐదో పుట్టినరోజు(జూన్ 8) సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోచన పథకంలో 101 మంది పేద చిన్నారులకు అకౌంట్లు తీయించారు. తన కూతురి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆ 101 మంది చిన్నారుల అకౌంట్లో నగదు జమ చేశారు. ప్రతి ఏటా ఎంతో కొంత నగదు అందులో డిపాజిట్ చేయడం ద్వారా ఆ బాలికలకు 21 ఏళ్లు నిండిన తర్వాత పెద్దమొత్తంలో నగదు అందుతుంది. అది వారి చదువులకు, పెళ్లికి ఉపయోగపడతాయని జడేజా ఆ బాలికలను సుకన్య పథకంలో తమ చారిటీ తరపున అకౌంట్లు ఓపెన్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ మంచి పని క్రెడిట్ను ప్రధాని మోదీకి ఇస్తున్నట్లు రివాబా సోలంకి అప్పడు ప్రకటించారు. కాగా.. ఈ విషయంపై ఆగస్టు ఒకటిన ప్రధాన మంతి కార్యాలయం నుంచి ఆమెకు లేఖ విడుదలైంది. అది సోమవారం అందించినట్లు ఉంది.. దీంతో జడేజా ఆ అభినందన లేఖను ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఆ లేఖలో ప్రధాని మోదీ జడేజా భార్య చేసిన పనిని మెచ్చుకున్నారు. ఇలాంటి పనులు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. అలాగే జడేజా-రివాబా కూతురు చిన్నారి నిధ్యాన జడేజాకు దీనెనలు అందించారు. మరి రివాబా గొప్ప మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. <blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Kind words <a href="https://t.co/mXjBIPYW7K">pic.twitter.com/mXjBIPYW7K</a></p>&mdash; Ravindrasinh jadeja (@imjadeja) <a href="https://twitter.com/imjadeja/status/1556657099756675076?ref_src=twsrc%5Etfw">August 8, 2022</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>