ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్లో భారత్ ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ మరో షాకిచ్చింది. ఈ మ్యాచ్లో నిర్ణీత సమయం కన్నా రెండు ఓవర్లు తక్కువగా వేసినందుకు భారత్ జట్టుపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో టీమిండియాకు రెండు పాయింట్ల కోత వేయడంతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధించారు. దీంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్ కంటే ముందు నాలుగో స్థానంలో ఉన్న పాకిస్థాన్.. మూడో స్థానంలోకి వచ్చింది. ఇలా ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోతే పాకిస్థాన్కు కలిసొచ్చింది. ఈ మ్యాచ్కు ముందు వరకు మూడో స్థానంలో కొనసాగిన భారత్.. 52.08 విజయాల శాతంతో పాటు 75 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 84 పాయింట్లు 77.78 విజయాల శాతంతో ఆస్ట్రేలియా టాప్లో ఉండగా.. దక్షిణాఫ్రికా 60 పాయింట్లు 71.43 విజయ శాతంతో రెండో స్థానంలో, పాకిస్థాన్ 44 పాయిట్లతో 52.38 విజయశాతంతో భారత్ కన్నా ముందున్నాయి. పాయింట్ల శాతం ఆధారంగా జట్ల స్థానాలను నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే. ఇక టీమిండియా డబ్యూటీసీ ఫైనల్ చేరడం కష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021 -23 సైకిల్లో భాగంగా భారత్ ఆడనున్న తదుపరి సిరీస్ల్లోని 6 మ్యాచ్లకు 6 గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో 4టెస్టు మ్యాచ్ల్లో ఇండియా తలపడనుంది. అలాగే నవంబర్లో బంగ్లాదేశ్ పర్యటనలో రెండు మ్యాచ్లు ఆడనుంది. ఈ రెండు సిరీస్ల్లోని మొత్తం 6 మ్యాచ్ల్లోనూ గెలిస్తే ఇండియాకు 68కి పైగా విన్నింగ్ పర్సంటేజీ వచ్చి ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. More bad news for India after a humiliating loss against England, as they have been docked two WTC points due to slow over rate. As a result, Pakistan have gained a spot and are now placed at #3 on the Points Table.#WTC23 #ENGvIND pic.twitter.com/h28G6voOaz — Jyoti Suman (@Jas23478675) July 5, 2022