బర్మింగ్హమ్ వేదికగా ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్లోని మహిళల టీ20 క్రికెట్ విభాగంలో భారత జట్టు రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్లో 9 పరుగుల తేడాతో భారత్ గోల్డ్ మెడల్ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే జట్టులో తమ సత్తా చాటిన మహిళా క్రికెటర్లు.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ నుండి స్మృతి మంధాన, షఫాలీ వర్మలతో పాటు మరొక వుమెన్ బ్యాటర్ కూడా సత్తా చాటారు. ఆమెనే జెమిమా రోడ్రిగస్. టీమ్లో తన ఆటతో, ముఖ్యంగా బ్యాటింగ్తో ప్రభావితం చేసిన క్రికెటర్ జెమిమా రోడ్రిగస్. బార్బడోస్తో 46 బంతుల్లో 56 పరుగులు చేసి 100 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో రోడ్రిగ్స్ కీలకపాత్ర పోషించారు. ఫైనల్లో కూడా 33 బంతులకి 33 పరుగులు చేయడంతో భారత్ దాదాపు గెలుపు అంచుల వరకూ వెళ్ళగలిగింది. ఫైనల్లో ఆస్ట్రేలియా బంగారు పతకం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్ 2022 పూర్తయ్యినప్పటికీ.. రోడ్రిగ్స్ మరోసారి అందరి దృష్టిని ఆకర్శించారు. ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేశారు. అందులో ఆమె తన కాలిని క్రీజ్లో ఉంచి.. ముందుకెళ్ళి బంతిని ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు, ఆమె స్టంపౌట్ అవ్వకుండా తప్పించుకున్నాట్టు ఉంది. ఈ ఫోటోతో పాటు ఎం.ఎస్.ధోనీ, విరాట్ కోహ్లీలు కూడా ఇలా క్రీజ్లో కాలు ఉంచి షాట్కి ట్రై చేసిన ఫోటోలను జత చేశారు. "నేను కూడా ప్రత్యేకమైన విభాగంలో చేరినట్లు అనిపిస్తోంది" అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. Looks like I'm now part of Elite Company pic.twitter.com/EkLJq7BaZF — Jemimah Rodrigues (@JemiRodrigues) August 16, 2022 ఇది కూడా చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ ఫాలోయింగ్ చూస్తే మెంటలే.. ఇది కూడా చదవండి: భారత జట్టుకి ఎంపికవ్వడమే నా కల.. భారత్ను గెలిపిస్తా: షాబాజ్ అహ్మద్