ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో రెజ్లింగ్ లో భారత్ ఆటగాళ్ళు మూడు స్వర్ణాలను గెలుచుకొని అద్భుతం సృష్టించారు. నాలుగేళ్ల కిందట అయిదు స్వర్ణాలు సహా పన్నెండు పతకాలు కొల్లగొట్టారు మన కుస్తీ యోధులు. ఈసారి కూడా భారత రెజ్లర్లు అదే జోరు కొనసాగిస్తున్నారు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ గేమ్స్లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా… అన్షు మలిక్ రజతం… దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు సంపాదించారు. ఇప్పటి వరకు స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా… అన్షు మలిక్ రజతం… దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు సంపాదించారు. పురుషుల 65 కేజీల విభాగంలో బజ్రంగ్ పునియా 9-2తో లాచ్లన్ మెక్నీల్ (కెనడా)ను చిత్తుచేసి టైటిల్ నిలబెట్టుకున్నాడు. తన దూకుడు ప్రదర్శించి వరుసగా రెండో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇది ఆయనకు మూడవ పథకం.. 2014లో 61 కేజీల విభాగంలో రజతం నెగ్గిన అతను.. నాలుగేళ్ల క్రితం 65 కేజీల ఛాంపియన్గా నిలిచాడు. మహిళల 62 కేజీల ఫైనల్లో సాక్షి మలిక్.. గోంజాలెజ్ (కెనడా)ను కిందపడేసి విజయాన్ని అందుకుంది. మొదట్లో ప్రత్యర్థిని పడగొట్టేందుకు విఫల యత్నం చేసిన సాక్షి కింద పడిపోవడంతో ప్రత్యర్థికి రెండు పాయింట్లు సాధించింది. కాగా, తొలి మూడు నిమిషాలు ముగిసే సరికి 0-4తో వెనకబడింది. విరామానంతరం ఒక్కసారిగా తన దూకుడు ప్రదర్శించింది.. ప్రత్యర్థిని ఎత్తిపడేసి, పైకి లేవకుండా అలాగే మ్యాట్కు అదిమి పట్టిన సాక్షి విజయాన్ని అందుకుంది. 2014 కామన్వెల్త్ క్రీడల్లో సాక్షి రజతం, 2018లో కాంస్యం సాధించగా, తాజాగా స్వర్ణ పతక విజేతగా నిలవడం విశేషం. ఇక తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొన్న దీపక్ పూనియా ఫైనల్లో 3–0తో మొహమ్మద్ ఇనామ్ (పాకిస్తాన్)పై గెలిచాడు. కాగా, సెమీఫైనల్లో దీపక్ 3–1తో అలెగ్జాండర్ మూర్ (కెనడా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో కసెబామా (సియరీ లియోన్)పై, తొలి రౌండ్లో 10–0తో మాథ్యూ ఒక్జెనామ్ (న్యూజిలాండ్)పై విజయం సాధించాడు. ఇక మహిళల 57 కేజీల ఫైనల్లో అన్షు 3-7తో ఒడునాయో (నైజీరియా) చేతిలో ఓడి రజతం అందుకుంది. 68 కేజీల విభాగంలో దివ్య కక్రాన్ కాంస్యం గెలిచింది. పతక పోరులో ఆమె టోంగా రెజ్లర్ టైగర్ లైలీని ఓడించింది. ఇప్పటి వరకు కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత అథ్లెట్లు 26 పతకాలు సాధించగా.. అందులో 9 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. మొత్తానికి భారత్ క్రీడాకారులు ఈసారి కామన్వెల్త్ గేమ్స్ తమ సత్తా చాటుతూ తలెత్తుకునేలా చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. A triple threat! What a night for @WeAreTeamIndia in the wrestling! They carry off three gold medals! #CommonwealthGames #B2022 pic.twitter.com/P861ifstCk — Commonwealth Sport (@thecgf) August 5, 2022 ఇది చదవండి: వీడియో: రిపోర్టర్ అవతారం ఎత్తి.. బడిలో సమస్యలను బయటపెట్టిన బాలుడు! ఇది చదవండి: మూవీ చూసి కన్నీరు పెట్టుకున్న సీతా రామం హీరోయిన్!