కపిల్ దేవ్: దేశంలో క్రికెట్ ఉనికికి ప్రాణం పోసిన ఆద్యుడు.. కపిల్ దేవ్. ఇతని సారధ్యంలోనే భారత జట్టు 1983లో మొదటి వరల్డ్ కప్ ను ముద్దాడింది. కపిల్ దేవ్ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా కొనసాగాడు. సచిన్ టెండూల్కర్ : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. అలాగే.. ఎన్నో బిరుదులు అందుకున్నాడు. సచిన్ క్రికెట్ కు చేసిన సేవకు గుర్తుగా 2010 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ కెప్టెన్ గా సచిన్ నియామకం అయ్యారు. మహేంద్ర సింగ్ ధోని : అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో అడుగు పెట్టకముందు ధోని.. ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం చేశాడు. 2011లో ధోని కెప్టెన్సీ లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. అదే సంవత్సరంలో లెఫ్టినెంట్ కల్నెల్ గా నియమితుడయ్యాడు. యుజ్వేంద్ర చాహల్: టీమిండియా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ 2016లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసాడు. చాహల్ కు టాక్స్ డిపార్ట్ మెంట్ వాళ్లు ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ పోస్టు ను ఆఫర్ చేశారు. ప్రస్తుతం దాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్ : 2016లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ గా అపాయింట్ అయ్యారు. జోగిందర్ శర్మ : 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ వేసి భారత జట్టుకు మరుపారని విజయాన్ని అందించిన జోగిందర్ శర్మ హర్యానా పోలీస్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ సూపెరిండెంట్ ఆఫ్ పోలీస్ గా వర్క్ చేశాడు. ఉమేష్ యాదవ్: టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా అపాయింట్ అయ్యారు. ఇది కూడా చదవండి: Virat Kohli: విమర్శలపై స్పందించిన విరాట్ కోహ్లీ..! కాస్త గట్టిగానే ఇచ్చేశాడు! ఇది కూడా చదవండి: సిక్సర్ కారణంగా గాయపడిన చిన్నారి తండ్రికి రోహిత్ శర్మ ఫోన్!