పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా విజయఢంకా మోగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్కు వర్షం అడ్డొచ్చినా.. డక్వర్త్ లూయీస్ పద్దతిలో భారత్ విజయం సాధిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు శుభ్మన్ గిల్, కెప్టెన్ శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు 113 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. 74 బంతుల్లో 7 ఫోర్లతో 58 పరుగులు చేసిన ధావన్ హైడెన్ వాల్ష్ బౌలింగ్లో పూరన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ అదే ఫ్లోలో ముందుకు నడిపించాడు. 34 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్తో 44 పరుగులు చేసిన అయ్యర్ హోసేన్ బౌలింగ్లో కీమోకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 199 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇక ఈ సిరీస్లోని గత రెండు మ్యాచ్ల్లోనూ విఫలమైన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లోనూ పరుగులు చేయలేకపోయాడు. కేవలం 8 పరుగులు చేసి హైడెన్ వాల్ష్ బౌలింగ్లో బ్రూక్స్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయ్యర్ వికెట్ పడిని కొద్ది సేపటికే 211 పరుగుల వద్ద టీమిండియా సూర్య వికెట్ను కోల్పోయింది. ఆ క్రీజ్లోకి వచ్చిన సంజూ శాంసన్ 6 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. గిల్ 98 పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగించింది. అప్పటికి టీమిండియా 36 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. చాలా సేపటి తర్వాత వర్షం ఆగిపోవడంతో.. డక్వర్త్ లూయీస్ పద్ధతిలో అంపైర్లు 35 ఓవర్లకు మ్యాచ్ను కుదించి వెస్టిండీస్కు 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్యఛేదనకు దిగిన విండీస్ను మొహమ్మద్ సిరాజ్ తన తొలి ఓవర్లోనే దారుణంగా దెబ్బ తీశారు. తొలి మూడు బంతుల్లోనే కైల్ మేయర్స్, బ్రూక్స్ను అవుట్ చేసి విండీస్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. బ్రాండన్ కింగ్(42), కెప్టెన్ నికోలస్ పూరన్(42) పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు టీమిండియా బౌలర్ల ముందు చేతులెత్తేశారు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చహల్ 4 వికెట్లతో చెలరేగాడు. సిరాజ్ 2, శార్దుల్ ఠాకూర్ 2, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. 98 పరుగులతో సత్తా చాటి వర్షం కారణంగా సెంచరీ మిస్ అయిన శుభ్మన్ గిల్కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక తొలి రెండు మ్యాచ్ల్లో గట్టి పోటీ ఇచ్చిన వెస్టిండీస్ ఈ మ్యాచ్లో మాత్రం తేలిపోయింది. మరి ఈ టీమిండియా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ! Congratulations #TeamIndia on winning the #WIvIND ODI series! Over to T20Is now! pic.twitter.com/kpMx015pG1 — BCCI (@BCCI) July 27, 2022 Well played to @BCCI on the series victory and 3-0 win. #WIvIND pic.twitter.com/vy7xAZ55H6 — Windies Cricket (@windiescricket) July 27, 2022