ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ కు ముందు భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈనెల 18 నుంచి హరారే వేదికగా జింబాబ్వేతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు శనివారం జింబాబ్వేకు పయనమయ్యారు. ఈ తరుణంలో జింబాబ్వే కోచ్ డేవ్ హ్యూస్టన్ టీమ్ఇండియాకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. బీసీసీఐ ఎలాంటి జట్టును పంపించినా తాము గట్టి పోటీనిస్తామని హెచ్చరించాడు. దాదాపుగా ఆరేళ్ల తర్వాత టీమిండియా జింబాబ్వేలో పర్యటిస్తోంది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు శనివారం ఉదయమే విమానంలో అక్కడికి బయల్దేరింది. ఆగస్టు 18, 20, 22న హరారే వేదికగా మూడు వన్డేలు ఆడనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్లో భాగంగా ఈ వన్డే సిరీస్ జరుగుతోంది. మొత్తం 13 జట్లు ఈ లీగులో తలపడుతున్నాయి. ఎక్కువ మ్యాచులు గెలిచినవాళ్లు.. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధిస్తారు. Team India leaves for Zimbabwe , Best of Luck Guys #CricketTwitter #ZIMvsIND #ZIMvIND - BCCI pic.twitter.com/XSzj94ItWc — Ankan Kar (@AnkanKar) August 12, 2022 'ఐపీఎల్ వల్ల ఎందరో నాణ్యమైన ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఒకేసారి.. 3, 4 జట్లను కూడా ప్రకటించగల సత్తా బీసీసీఐకి ఉంది. వారు పంపించే జట్టేదైనా పటిష్ఠంగానే ఉంటుందని మాకు తెలుసు. అందులో ప్రతి ఒక్కరికీ అంతర్జాతీయ అనుభవం ఉంటుందని ఎరుకే. అలాగని చూస్తో కూర్చోం.. గట్టి పోటీ ఇస్తాం. ఏదేమైనా.. ఈ సిరీస్ మాకు కఠిన సవాల్' అని డేవ్ పేర్కొన్నాడు. 'చాలారోజుల తరువాత భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుందని మా కుర్రాళ్లకు చెప్పాను. భారీ స్కోర్లు చేసి, మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇదో మంచి అవకాశమని గుర్తు చేశాను. భారత్ ఆడే గొప్ప క్రికెట్ను చూసేందుకో, సంఖ్య పరంగా మరో మూడు మ్యాచుల్ని ముగించేందుకో మనం పరిమితం కాకూడదని చెప్పా. రాహుల్ సేనకు సవాళ్లు విసరగలమన్న నమ్మకం నింపాను. ఈ మూడు వన్డేల్లో మేం భారత జట్టుకు గట్టి సవాళ్లు విసరగలమనే నా విశ్వాసం' అని హ్యూస్టన్ పేర్కొన్నాడు. ఇక హరారే వేదికగా టీమిండియా- జింబాబ్వే జట్ల మధ్య ఆగష్టు 18న మొదటి వన్డే, ఆగష్టు 20న రెండో వన్డే, ఆగష్టు 22న మూడో వన్డే జరుగనున్నాయి. కాగా ఇటీవల స్వదేశంలో జింబాబ్వే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. తమ దేశంలో పర్యటించిన బంగ్లాదేశ్కు షాకిస్తూ టీ20, వన్డే సిరీస్లను 2-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు సైతం గట్టి పోటీనిస్తామంటూ జింబాబ్వే కోచ్ డేవిడ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. Zimbabwe have won the ODI series against Bangladesh!#ZIMvIND #ZIMvsIND #BangladeshCricket #RyanBurl #SikandarRaza #TamimIqbal pic.twitter.com/0BCfrlPVcT — ScoresNow (@scoresnow_in) August 7, 2022 భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శామ్సన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్ 2013 ✅ 2015 ✅ 2016 ✅ Three different ODI series, three clean sweeps for Team India #India #ZIMvsIND #Cricket #ODIs #KLRahul pic.twitter.com/Cdm8B4WSHz — Wisden India (@WisdenIndia) August 12, 2022 ఇదీ చదవండి: Viral Video: ఆకలిగొన్న పులి విరాట్ కోహ్లీ.. ఈసారి ఘర్జించడం ఖాయం.. ఈ వీడియో ఒక్కటి చాలు! ఇదీ చదవండి: పుజారా అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరు..! సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ