టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్- 2022 ఫుల్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మూడో వన్డేలోనూ భారత్ చెలరేగడంతో వన్డే సిరీస్ కూడా టీమిండియా సొంతమైంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టి కృషితో.. మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. దీంతో 2-1 తేడాతో వన్డే సిరీస్, 2-1 తేడాతో టీ20 సిరీస్ ను టీమిండియా సొంతం చేసుకున్నట్లు అయ్యింది. ఈ మ్యాచ్ కు సంబంధించి ఇంగ్లాండ్ బ్యాటర్ లివింగ్ స్టోన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. 67వ ఓవర్లో అతను కొట్టిన సిక్సరే అందుకు కారణం. లివింగ్ స్టోన్ అంటేనే భారీ సిక్సర్లకు పెట్టింది పేరు. 37వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతిని.. లివింగ్ స్టోన్ భారీ సిక్సర్ కొట్టాడు. అది కాస్తా స్టేడియంలోని కన్స్ట్రక్షన్ సైట్ లో పడింది. అక్కడున్న కార్మికులు బంతిని వెతికి తిరిగి మైదానంలోకి విసిరేశారు. A memorable #ENGvIND tour for #TeamIndia as we finish it on a winning note. pic.twitter.com/cxPLXpoBvh — BCCI (@BCCI) July 17, 2022 ఇంక మ్యాచ్ విషయానికి వస్తే... మూడో వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా 45.5 ఓవర్లలో 259 పరుగులకే ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేసింది. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు, చాహల్ 3 వికెట్లు, సిరాజ్ 2, జడేజా 1 వికెట్ తో ఇంగ్లాండ్ ను మట్టికరిపించారు. 260 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 5 వికెట్ల నష్టానికి 42.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. లివింగ్ స్టోన్ కొట్టిన భారీ సిక్సర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: పంత్ పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి ఇంత కోపమా? ఫ్యాన్స్ ఆగ్రహం! ఇదీ చదవండి: వీడియో: లండన్ వీధుల్లో ధోనికి వింత అనుభవం.. చేజ్ చేసి మరీ!