హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలోని టీమిండియా రెండు టీ20ల సిరీస్లో ఐర్లాండ్ను క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన రెండు టీ20లో భారత్ 4 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించి సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. కానీ.. ఈ మ్యాచ్లో హార్థిక్ పాండ్యా మరోసారి తన దురుసు ప్రవర్తనతో విమర్శల పాలయ్యాడు. ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియాకు కెప్టెన్గా ఉన్న హార్థిక్ పాండ్యా మరోసారి నోరు జారి.. తోటి ఆటగాళ్లను బూతులు తిట్టాడు. ఐర్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేస్తున్నాడు. ఆ ఓవర్ చివరి బంతిని ఐరీస్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. కానీ.. బంతి ఇన్ స్వింగ్ అవుతూ.. బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి వెళ్లింది. దీంతో హర్షల్ పటేల్ దాన్ని ఎల్బీడబ్ల్యూ కోసం అపీల్ చేశాడు. అతనికి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా జతకలిశాడు. ప్యాడ్కు ఇన్సైడ్ ఎడ్జ్ తగిలిందని.. కెప్టెన్ హార్థిక్ పాండ్యాను ఒప్పించి డీఆర్ఎస్ తీసుకోవాలని కోరారు. పాండ్యా రివ్వ్యూ కోరగా.. అది క్లియర్గా అవుట్ సైడ్ ఆఫ్స్టంప్ నుంచి వెళ్తున్నట్లు తేలింది. దీంతో ఇండియా ఒక రివ్వ్యూను కోల్పోయింది. దీంతో సహనం కోల్పోయిన హార్థిక్ పాండ్యా హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్పై బూతులతో విరుచుకుపడ్డాడు. పాండ్యా తిట్టిన బూతులు స్టంప్స్ మైక్లో క్లియర్గా రికార్డ్ అయ్యాయి. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రివ్వ్యూ వేస్ట్ అవ్వడం క్రికెట్లో కామన్ అని అంతమాత్రందానికే ఆటగాళ్లను అలా బూతులు తిట్టాలా అంటూ నెటిజన్లు పాండ్యాపై ఫైర్ అవుతున్నారు. పద్దతి మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు. గతంలో కూడా ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరించిన పాండ్యా.. తన టీమ్ మెంబర్, సీనియర్ ఇండియన్ ప్లేయర్ అయిన మొహమ్మద్ షమీపై క్యాచ్ కోసం ప్రయత్నించనందుకు నోరు పారేసుకుని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Pandya abused both Harshal and kishan for convincing him take the review #INDvsIRE pic.twitter.com/eC5XA7vGAc — ʙɪɢʙᴀʟɪ☠️ (@darsh__45) June 28, 2022