ఎంత మంది బౌలర్లను, ఎన్ని రకాల ఫీల్డింగ్ సెట్లలను చూసుంటే విరాట్ కోహ్లీ ఈ స్థాయికి వచ్చి ఉంటాడు. అలాంటి ఛాంపియన్ ప్లేయర్కే నిన్నమొన్న క్రికెట్ ఓనమాలు దిద్దిన ఆటగాడు ఫీల్డింగ్ సెట్ చేస్తే ఎలా? అయినా కూడా చిన్న మాస్టర్ బ్రెయిన్ను ఉపయోగించి ఫీల్డింగ్లో మార్పులు చేస్తే కోహ్లీ గమనించలేడా..? దానికి తగ్గట్లు ఆడి పరుగులు రాబట్టలేడా? ఫీల్డ్కు తగ్గట్లు బ్యాటింగ్ చేయడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ.. కోహ్లీ ఫీల్డింగ్ను ఎలా గమనిస్తాడో ప్రపంచ క్రికెట్కు చూపించాడు. ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్ ఫోర్లో ఆదివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియాకు మంచి స్టార్ట్ ఇచ్చిన తర్వాత ఓపెనర్లు రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ను నడిపించే బాధ్యతను కోహ్లీ తీసుకున్నాడు. నిలకడగా ఆడుతూ.. పాక్ బౌలర్లపై ఎదురుదాటికి దిగాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 8వ ఓవర్ 4వ బంతికి కోహ్లీ స్ట్రైక్లో ఉండగా.. పాక్ వికెట్ కీపర్ రిజ్వాన్ లాంగ్ఆఫ్లో ఫీల్డర్ను మరింత వెనక్కు జరిపాడు. ఈ విషయాన్ని గమనించిన కోహ్లీ..‘కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. కానీ.. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’ అనే మాటను నిజం చేస్తూ.. వికెట్ల వెనుక నుంచి రిజ్వాన్ సైగలను గమనించి.. కేవలం కళ్లతోనే ఫీల్డింగ్ మార్పుపై ఒక లుక్కేస్తాడు. ఇందులో హైలెట్ ఏంటంటే.. రిజ్వాన్ ఎక్కడైతే ఫీల్డర్ను వెనక్కుపంపాడో తర్వాత బంతిని అటువైపే ఆడి రెండు పరుగులను సాధిస్తాడు. దీంతో కోహ్లీ టాలెంట్ ఏంటో రిజ్వాన్కు అర్థమవుతుంది. కాగా.. కోహ్లీ ఫీల్డ్ సెట్ను ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా.. కళ్లతోనే అలా చూసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. తన కోసం రిజ్వాన్ సెట్ చేసిన ఫీల్డ్ను అపహాస్యం చేస్తూ.. కోహ్లీ అటువైపే షాట్ ఆడి రిజ్వాన్ గాలి తీశాడంటూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఇలా పాక్ ఫీల్డింగ్ను ఛేదిస్తూ.. బౌలర్లపై ఎదురుదాటి చేస్తూ.. విరాట్ 44 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్తో 60 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు, నషీమ్ షా, హూస్నైన్, రౌఫ్, నవాజ్ తలో వికెట్ తీసుకున్నారు. టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 71 పరుగులుచేసి రాణించాడు. నవాజ్ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ఆసిఫ్ అలీ రెండు ఫోర్లు, ఒక సిక్స్తో విలువైన 16 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, అర్షదీప్, భువీ, పాండ్యా, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో చాహల్, పాండ్యా, భువీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరి ఈ మ్యాచ్పై, తన కోసం రిజ్వాన్ సెట్చేసిన ఫీల్డ్ను కోహ్లీ గమనించిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: మ్యాచ్ ఓడినా.. పాకిస్థాన్పై టీమిండియా కొత్త చరిత్ర! 10 ఏళ్ల తర్వాత.. Rizwan waving the long off fielder just before the bowler bowls. King observing the movements till the very end. pic.twitter.com/1iOvd5vpQA — Kaushik (@CricKaushik_) September 4, 2022