15వ ఎడిషన్, ఆసియా కప్-2022 టోర్నీ ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక పోరుతో టోర్నీ ప్రారంభం కానుండగా, ఆ మరుసటి రోజే దాయాదుల పోరు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే.. ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆటగాళ్ల పలకరింపులు మొదలయ్యాయి. పరస్పరం ఆత్మీయ పలకరింపులతో అభిమానుల మనసు దోచుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కరలుకొడుతున్నాయి. గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన షాహీన్ అఫ్రిదీతో భారత క్రికెటర్లు యజ్వేంద్ర చాహాల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ కాసేపు ముచ్చటించారు. తొలుత భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, షాహీన్ అఫ్రిదీని కౌగిలించుకుని ఎలా ఉన్నావని పలకరించాడు. ఆ తర్వాత అటుగా వచ్చిన విరాట్ కోహ్లీ, అఫ్రిదీ గాయం గురించి ఆరా తీశాడు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఆపై అఫ్రిదీ కూడా కోహ్లీ త్వరగా ఫామ్లోకి రావాలని ప్రార్థన చేస్తా..' అని తెలిపాడు. The suspense is over! Let's listen to the conversation between @iShaheenAfridi and @imVkohli #AsiaCup2022 pic.twitter.com/ttVYLrNtuO — Pakistan Cricket (@TheRealPCB) August 26, 2022 విరాట్ తర్వాత రిషబ్ పంత్, అఫ్రిదీతో కాసేపు ముచ్ఛటించాడు. 'నేను మీలా బ్యాటర్ని అయితే బాగుండు, ఒంటి చేత్తో సిక్సర్లు కొట్టేవాడిని..' అని అఫ్రిదీ తెలపగా, దానికి రిషబ్ పంత్.. 'అవునా.. నువ్వు ఫాస్ట్బౌలర్ కదా! తప్పకుండా! ప్రయత్నించు' అని రిప్లై ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . Stars align ahead of the #AsiaCup2022 A high-profile meet and greet on the sidelines pic.twitter.com/c5vsNCi6xw — Pakistan Cricket (@TheRealPCB) August 25, 2022 గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో షాహీన్ అఫ్రిదీ, భారత జట్టును ఘోరంగా దెబ్బ తీశారు. తొలి ఓవర్ మొదటి బంతికే రోహిత్ శర్మను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన అఫ్రిదీ, ఆ తర్వాత ఓవర్లో కెఎల్ రాహుల్ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఆపై.. హాఫ్ సెంచరీతో భారత జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన కోహ్లీని సైతం పెవిలియన్ చేర్చాడు. ఈ దెబ్బతో భారత జట్టుతో ఏమాత్రం కోలుకోక.. పది వికెట్ల తేడాతో ఓటమి పాలవుతుంది. ఇక, గాయపడ్డ అఫ్రిదీ స్థానంలో మహ్మద్ హస్నైన్ను ఎంపిక చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. కాగా, ఇప్పటికే.. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, శ్రీలంక పేసర్ దుష్మంత చమీరా గాయం కారణంగాటోర్నీకి దూరమయ్యారు. ఆటగాళ్ల ఆత్మీయ పలకరింపులపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Asia Cup 2022: షాహీన్ ఆఫ్రిదీ ప్లేస్లో నిషేధిత బౌలర్ని పట్టుకొచ్చిన పాకిస్తాన్..! ఇదీ చదవండి: IND vs PAK: షాహీన్ అఫ్రిదీ లేకున్నా.. ఈ ముగ్గురు భారత్ను వణికిస్తారు: పాక్ కోచ్