ఆసియా కప్ 2022లో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గ్రూప్ స్టేజ్లో మన చేతిలో చిత్తుగా ఓడిన పాక్.. సూపర్ ఫోర్లో టీమిండియాను ఓడించింది. మంచి బ్యాటింగ్ పిచ్పై టాస్ ఓడిన భారత్.. బ్యాటింగ్కు దిగి మంచి ఆరంభాన్ని అందుకుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్-రోహిత్ శర్మ ఫోర్లు, సిక్సులతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో టీమిండియా 5 ఓవర్లలోపే 50 రన్స్ పూర్తి చేసుకుంది. కానీ.. ఓపెనర్లు అందించిన మెరుప ఆరంభాన్ని మిడిల్డార్ బ్యాటర్లు సద్వినియోగించుకోలేకపోయారు. ఓపెనర్లు అవుటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాటపట్టారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే నిలకడగా ఆడుతూ.. ఒంటరి పోరాటం చేశాడు. రోహిత్-రాహుల్ అందించిన ఆరంభం చూస్తే.. భారత్ 200 పైచిలుకు పరుగులు చేసేలా కనిపించింది. కానీ.. మిడిల్డార్ వైఫల్యం, కోహ్లీ పోరాటంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగుల టార్గెట్ను పాక్ ముందు ఉంచింది. లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్ను టీమిండియా కెప్టెన్ రోహిత్ మంచి మూవ్తో రవి బిష్ణోయ్ని పవర్ప్లేలో బౌలింగ్కు దింపి పాక్ కెప్టెన్ బాబర్ను బోల్తా కొట్టించాడు. కానీ మరో ఎండ్లో మొహమ్మద్ రిజ్వాన్ టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పాక్ను గెలుపు దిశగా నడిపించాడు. నవాజ్తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో టీమిండియా ఫీల్డర్ అర్షదీప్.. ఆసిఫ్ అలీ ఇచ్చిన సులువైన క్యాచ్ నేలపాలు చేయడం, 19వ ఓవర్లో భువనేశ్వర్ భారీగా పరుగులు సమర్పించుకోవడంతో పాక్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి.. భారత్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 71 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడిన పాక్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్.. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘భారత్-పాక్ మ్యాచ్ను ప్రపంచ మొత్తం చూస్తుందని తెలుసు. ఈ మ్యాచ్ మాకు ఫైనల్ అంత విలువైంది. ఈ మ్యాచ్లో ప్రతి ఆటగాడు తమ వందశాతం ఎఫర్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. మా ప్లాన్ ప్రకారం ఎప్పటిలాగే కొత్త బంతితో పరుగుల చేస్తూ.. నేను, బాబర్ ఇద్దరిలో ఒకరు చివరి వరకు ఆడాలని అనుకున్నాం. మా బలమేంటో మాకు తెలుసు. మా బ్యాటింగ్లో మంచి డెప్త్ ఉంది. చివరి నాలుగు ఓవర్లలో 45 పరుగులు అవసరమైనా కొట్టగలిగే హిట్టర్లు మాకు ఉన్నారు. అందుకే మే ఎలాంటి భయం పెట్టుకోలేదు.’ అని రిజ్వాన్ అన్నాడు. కాగా.. ఈ మ్యాచ్లో టాస్ ఎంతో కీలకంగా మారింది. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై టాస్ గెలవడం పాక్కు బాగా కలిసి వచ్చింది. అలాగే రెండో ఇన్నింగ్స్ సమయంలో డ్యూ రావడంతో బౌలింగ్ కష్టంగా మారింది. మరి ఈ మ్యాచ్పై రిజ్వాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పాక్పై టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు! Consecutive half-centuries for @iMRizwanPak The opening batter is playing an important innings #AsiaCup2022 | #INDvPAK pic.twitter.com/JlkrZPwkf2 — Pakistan Cricket (@TheRealPCB) September 4, 2022 14th T20I fifty for Mohammad Rizwan : Disney+Hotstar pic.twitter.com/pdEuexH1TW — CricTracker (@Cricketracker) September 2, 2022