ఆసియా కప్ 2022లో టీమిండియా భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫోర్ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓడింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ మజాను క్రికెట్ అభిమానులకు అందించినా.. టీమిండియా చేసిన కొన్ని తప్పులు కూడా ఓటమికి కారణంగా నిలుస్తున్నాయి. చాలా రోజులుగా సరైన ఫామ్లో లేని టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ ఆదివారం మ్యాచ్లో మాత్రం బ్రహ్మాండమైన ఆరంభాన్ని అందించారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి టీమిండియా ఇన్నింగ్స్కు వెన్నుముకలా నిలబడి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో టీమిండియా 181 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయినా కూడా భారత్ పాక్ చేతిలో ఓడింది. మరి టీమిండియా ఓటమికి గల ఐదు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. దారుణంగా విఫలమైన మిడిల్డార్ ఓపెనర్లు రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించారు. పవర్ప్లేలో బౌలర్లపై ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. దీంతో టీమిండియా 5 ఓవర్లలోపే 50 పరుగులు పూర్తి చేసుకుంది. కానీ.. ఇద్దరు ఓపెనర్లు మంచి టచ్లో కనిపించినా ఎక్కువ సేపు క్రీజ్లో నిలువలేకపోయారు. ఒకరి వెంట మరొకరు వెంటవెంటనే అవుట్ అయ్యారు. వన్డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ.. నిలకడగా ఆడుతున్నా.. మరోఎండ్లో టీమిండియా మిడిల్డార్ బ్యాటర్లు క్రీజ్లో నిలవలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆరంభం చూసి భారత్ 200పై చిలుకు పరుగులు చేస్తుందనుకుంటే 181తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది కేవలం మిడిల్డార్ వైఫల్యం కారణంగానే అని గట్టిగా చెప్పవచ్చు. 2. కొట్టొచ్చినట్లు కనిపించిన ఫినిషర్ డీకే లోటు టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో దూరమవ్వడంతో అతని స్థానంలో లెఫ్టాండర్గా రిషభ్ పంత్ను కొనసాగించిన కెప్టెన్ రోహిత్.. అనూహ్యంగా దినేష్ కార్తీక్ను పక్కన పెట్టి దీపక్ హుడాను జట్టులోకి తీసుకున్నాడు. ఈ నిర్ణయం చివరి ఓవర్లలో టీమిండియా బ్యాటింగ్పై ప్రతికూల ప్రభావం చూపించింది. హుడా మంచి ఫామ్లోనే ఉన్నా.. అతను టాపార్డర్ బ్యాటర్. కానీ.. పాక్తో మ్యాచ్లో చివరి ఓవర్లలో బ్యాటింగ్ రావడంతో ఒక ఫినిషర్ రోల్ను భర్తిచేయలేకపోయారు. ఫామ్లో ఉన్న హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ సైతం చెత్త షాట్లతో దారుణంగా విఫలం అయ్యారు. దీంతో దినేష్ కార్తీక్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతను ఉండి ఉంటే.. కచ్చితంగా డెత్ ఓవర్స్లో మంచి రన్స్ వచ్చేవి. కోహ్లీ ఒంటిరి పోరాటం చేసినా.. చివరి ఓవర్లో ఆశించిన పరుగులు చేయలేకపోయాడు. 3. వీక్ బౌలింగ్ ఎటాక్ నిజానికి ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన బౌలింగ్ ఎటాక్ అంత పటిష్టంగా లేదనే విమర్శలు మొదటి నుంచే ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ.. ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్ తేలిపోయారు. హాంకాంగ్ లాంటి పసికూనను కూడా ఆలౌట్ చేయకుండా.. 152 పరుగులు సమర్పించుకున్నప్పుడు టీమిండియా బౌలింగ్ ఎటాక్లో పసలేదని తేలిపోయింది. ఇప్పుడు పాక్తో మరింత ప్రయోగం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా, దీపక్ హుడాపై అతి నమ్మకంతో కేవలం నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాడు. పాక్తో జరిగిన తొలి మ్యాచ్లో బాల్తోనూ అద్భుతంగా రాణించిన పాండ్యా.. ఈ మ్యాచ్లో మాత్రం తేలిపోయాడు. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 19వ ఓవర్లో ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. జ్వరంతో ఆవేశ్ ఖాన్ ఈ మ్యాచ్లో ఆడక బతికిపోయాడు కానీ.. లేదంటే అతను కూడా టీమిండియా ఓటమికి తన వంతు పాత్ర పోషించేవాడు. 4. చెత్త ఫీల్డింగ్ గత కొన్నేళ్లుగా ఫీల్డింగ్లో ఒక రేంజ్ స్టాండెడ్స్ సెట్ చేసిన టీమిండియా ఆదివారం పాక్తో జరిగిన మ్యాచ్లో చేసిన ఫీల్డింగ్ మాత్రం నవ్వుల పాలు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ రవి బిష్ణోయ్ కొట్టిన రెండు షాట్లను చెత్త ఫీల్డింగ్ చేసి రెండు బౌండరీలు ఇవ్వడంతో ఇదేం ఫీల్డింగ్రా బాబు అంటూ నవ్వుకున్న భారత అభిమానులు కీలక సమయంలో అర్షదీప్ సింగ్ వదిలేసిన క్యాచ్తో ముక్కున వేలేసుకున్నారు. అసిఫ్ అలీ ఇచ్చిన సునాయస క్యాచ్ను అర్షదీప్ సింగ్ వదిలేయడం భారత్ కొంపముంచింది. 5. టాస్ ఓడిపోవడం ఇక అన్నింటి కంటే అతి ముఖ్యమైంది టాస్ ఓడిపోవడం. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ టాస్ ఓడిపోయాడు. పాక్ కెప్టెన్ బాబర్ తొలుత ఫీల్డిండ్ ఎంచుకున్నాడు. టాస్ అంత కీలకం కాదని ఇరు జట్ల కెప్టెన్లు పైపై మాటలు చెప్పినా.. మ్యాచ్ గడుస్తున్న కొద్ది టాస్ ఎంత కీలకమో అర్థమైంది. పిచ్ బ్యాటింగ్కు పూర్తి అనుకూలంగా ఉంది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు మరింత సహకరించింది. దానికి తోడు డ్యూ కూడా రావడంతో టీమిండియాకు కష్టాలు తప్పలేదు. పిచ్ పరిస్థితులతో పాటు టీమిండియా చేసిన తప్పులు, వీక్ బౌలింగ్ ఎటాక్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ వైఫల్యం టీమిండియా ఓటమికి కారణమయ్యాయి. మ్యాచ్ అన్నాక గెలుపోటములు సహజం. ఆసియా కప్లో తొలి మ్యాచ్లో పాక్ను 5 వికెట్ల తేడాతో ఓడించినా భారత్.. ఇప్పుడు పాక్ చేతిలో అదే 5 వికెట్ల తేడాతో ఓడింది. మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధిస్తే.. తిరిగి ఫైనల్లో మళ్లీ ఇండియా-పాక్ తలపడే అవకాశం ఉంది. మరి సూపర్ ఫోర్లో పాక్ చేతిలో టీమిండియా ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ఆ పదాన్ని పలకడానికి ఇబ్బంది పడ్డ రాహుల్ ద్రావిడ్.. What a win! #INDvPAK | #AsiaCup2022 pic.twitter.com/1KDci25HBz — ICC (@ICC) September 4, 2022 Rohit expression= whole india expression #INDvsPAK #RohitSharma #Arshdeep pic.twitter.com/WJ43N5w2py — Shubhankar Mishra (@shubhankrmishra) September 4, 2022 Return Of King #ViratKohli #AsiaCupT20 #INDvsPAK pic.twitter.com/rqHDFp0fpM — Thyview (@Thyview) September 4, 2022 Congrats Team! Very well played. Keep it up!#INDvsPAK pic.twitter.com/am6LY4r1VT — Hamza Shahbaz Sharif (@HamzaSS) September 4, 2022