రోహిత్ శర్మతు విశ్రాంతి కల్పించడం, కేఎల్ రాహుల్ గాయంతో సిరీస్ నుంచి తప్పుకోవడంతో.. సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ లో పంత్ కు కెప్టెన్ గా అవకాశం లభించిన విషయం తెలిసిందే. కెప్టెన్ గా తన కెరీర్ లో తొలి రెండు టీ20ల్లో ఓటమి చవిచూసిన రిషబ్ పంత్.. మూడో టీ20లో కెప్టెన్ గా తొలి విజయాన్ని అందుకున్నాడు. పంత్ సారధ్యంలో టీమిండియా సౌత్ ఆఫ్రికాపై 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 5 టీ20ల సిరీస్ లో ప్రస్తుతం 2-1 తేడాతో సఫారీలు ముందున్నారు. తర్వాతి రెండు మ్యాచుల్లో టీమిండియాకు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది. కెప్టెన్సీ సంగతి పక్కన పెడితే రిషబ్ పంత్ ఒక విధ్వంసకర బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యాన్స్, ఫాలోయింగ్ విషయంలోనూ పంత్ కు మంచి క్రేజ్ ఉంది. పంత్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో.. నిరూపించే ఘటన ఒకటి జరిగింది. అది కూడా ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో కాదు.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ క్రికెట్ స్టేడియంలో జరిగింది. సిబ్బంది కళ్లుగప్పి.. గ్యాలరీ నుంచి ఓ అభిమాని పరుగున వచ్చి రిషబ్ పంత్ కాళ్ల మీద పడ్డాడు. View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) విశాఖ క్రికెట్ స్టేడియంలో ఇండియా కెప్టెన్ రిషబ్ పంత్ కాళ్ళు పట్టుకున్న అభిమాని 18 ఏళ్ల శివ కుమార్ గా గుర్తించారు. శివ కుమార్ శ్రీకాకుళం జిల్లా వాసిగా తెలుస్తోంది. అయితే స్టేడియంలో అలా భద్రతా సిబ్బందిని దాటుకుని రిషబ్ పంత్ కాళ్లు పట్టుకోవడంపై శివ కుమార్ ను పీఎంపాలెం పోలీసు స్టేషన్కు తరలించారు. గతంలో సచిన్, ధోనీ, రోహిత్, కోహ్లీల కాళ్లపై అభిమానులు పడటం చూశాం. అయితే తాజాగా విశాఖలో రిషబ్ పంత్ కూడా ఆ జాబితాలోకి చేరిపోయాడు. అభిమాని రిషబ్ పంత్ కాళ్లు పట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. First win as #TeamIndia Captain Well done, @RishabhPant17! #RishabhPant pic.twitter.com/PRVyYUeQRH — Ramesh Konidina (@RameshKonidina) June 15, 2022 ఇదీ చదవండి: సెహ్వాగ్ ను గుర్తుచేసిన రుతురాజ్ గైక్వాడ్.. ఒకే ఓవర్లో 5 ఫోర్లు! ఇదీ చదవండి: దినేష్ కార్తీక్ను టీ20 ప్రపంచ కప్కు సెలక్ట్ చేయొద్దు: గౌతమ్ గంభీర్