జెంటిల్ మ్యాన్ గేమ్ గా పిలవబడే క్రికెట్ సమిష్టిగా ఆడే ఆట. అది ఏ ఒక్కరి వల్లో గెలిచేది కాదు.. ఏ ఒక్కరి వల్లో ఓడేది కాదు. అందులో ముఖ్యమైన పాత్ర పోషించేది.. జట్టును నడిపించే భాధ్యతను భుజాన వేసుకునే నాయకుడు. బలమైన నాయకుడుంటేనే ఆ జట్టు అద్భుతంగా రాణించగలదు. అలా భారత జట్టు బాధ్యతలను తమ భుజస్కంధాలపై మోసి ప్రపంచ క్రికెట్ జట్లలో ఒకటిగా నిలిపిన భారత దిగ్గజాలకు.. నేడు భారత జట్టు కెప్టెన్ ఎవ్వరో అర్థమవ్వడం లేదు. ఏ ముహూర్తాన విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడో తెలియదు.. కానీ, ప్రస్తుతం సిరీస్ కొక్కరు చొప్పున కెప్టెన్ గా చలామణి అవుతున్నారు. జట్టులో నిలకడగా స్థానం లేని ఆటగాళ్లకు సైతం జట్టును నడిపించే బాధ్యతలు అప్పగిస్తున్నారు.. మన సెలెక్టర్లు. ఏ ముహూర్తాన రాహుల్ ద్రావిడ్ ఇండియా హెడ్ కోచ్ అయ్యాడో.. అప్పటి నుంచి టీమిండియా జట్టుకు ఎవరు ఎప్పుడు కెప్టెన్ అవుతారో ఏమాత్రం అంచనా వేయలేనట్టు పరిస్థితి తయారైంది. విశ్రాంతి అనే మంత్రం జపిస్తూ.. సీనియర్లకు రెస్టుల మీద రెస్టులు ఇవ్వడం.. ఒక్కో ఫార్మాట్లో ఒక్కో కెప్టెన్ ఉండడంతో పరిస్థితి సిరీస్కో కెప్టెన్ అన్నట్లు తయారైంది. విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు మూడు ఫార్మాట్లకు దాదాపు అతను పక్కా అందుబాటులో ఉండేవాడు. విశ్రాంతి తీసుకున్న సందర్భాలు తక్కువే. కానీ రోహిత్ వచ్చాక పరిస్థితి తారుమారైంది. ఒక సిరీస్ ఆడితే మరో సిరీస్ రెస్ట్.. ఐపీఎల్ ఆడితే సిరీస్ల కొద్దీ విశ్రాంతి.. సీనియర్లకు ఆట కన్నా రెస్టే ఎక్కువయింది. KL Rahul ✅ Rohit Sharma ✅ Rishabh Pant ✅ Hardik Pandya ✅ Shikhar Dhawan ✅ Fifth different captain for Team India in white-ball cricket this year #ShikharDhawan #India #WIvsIND #Cricket #ODIs pic.twitter.com/587ppMKlHD — Wisden India (@WisdenIndia) July 6, 2022 ఇది కూడా చదవండి: India, Pakistan: ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడితే పాకిస్థాన్కు కలిసొచ్చింది! 2008 నుంచి 2021 వరకు 13 ఏళ్ల కాలంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో ఏడుగురు కెప్టెన్లు మాత్రమే కెప్టెన్సీ చేశారు. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దగ్గర్నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ సుదీర్ఘ కాలం పాటు జట్టును నడిపించాడు. ఇక విరాట్ కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ శర్మ అతని గైర్హాజరీలో జట్టును నడిపించాడు. కానీ విరాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి టీమిండియా పరిస్థితి పూటకో కెప్టెన్ అన్నట్లు తయారైంది. ఈ క్రమంలో త్వరలో వెస్టిండీస్ తో జరగబోయే సిరీస్ కు మరో.. నాయకుడు తెరమీదకొచ్చాడు. అతనెవరో కాదు.. శిఖర్ ధావన్. భారత అభిమానులు ముద్దుగా పిలుచుకునే గబ్బర్ కు స్థిరంగా జట్టులో స్థానం ఉంటుందో.. ఉండదో తెలియని పరిస్థితి. అలాంటి ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పగించడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కోచ్ ద్రవిడ్ లపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. "ధావన్ లో కెప్టెన్సీ లక్షణాలు కనిపెట్టిన గొప్పోళ్ళు మీరే అంటూ.." గంగూలీ, ద్రవిడ్ లపై సోషల్ మీడియా వేదికగా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. Shikhar Dhawan Will Lead India Against West Indies!#Cricket #IPL #IndianCricket #TeamIndia #INDVWI #ShikharDhawan pic.twitter.com/4IFhA8o05o — CRICKETNMORE (@cricketnmore) July 6, 2022 కెప్టెన్సీ మార్పులకు కారణాలేంటీ? ఈ ఏడాది ప్రారంభంలో విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. అయితే.. రోహిత్ తరచూ ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కోవడం, విశ్రాంతి ఇవ్వాల్సి రావడం ఒక ప్రధాన కారణం. ఇక వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం ఇటీవల గాయం కారణంగా మూడు నెలలు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనడం రెండో ప్రధాన కారణం. టీ20, వన్డే, టెస్ట్ మూడు ఫార్మాట్లలో ఆడే ప్లేయర్లు ఇండియా జట్టులో ప్రస్తుతం బుమ్రా, పంత్, శ్రేయస్ అయ్యర్ మినహా ఎవరూ లేరు. రోహిత్, రాహుల్ మిస్సయితే టీ20లకు పంత్, వన్డేలకు ధావన్, టెస్టులకు బుమ్రా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాల్సి వస్తుంది. ఒకేసారి రెండు సిరీస్ లను షెడ్యూల్ చేసినప్పుడు టీ20 జట్టులో పంత్ లేకపోతే హార్దిక్ పాండ్యా జట్టును లీడ్ చేయాల్సి వస్తుంది. #BCCI selecting captains be like pic.twitter.com/ocFnS93sXA — Tweetera (@DoctorrSays) July 6, 2022 ఇది కూడా చదవండి: England: భారత్పై గెలిచి ఏం సాధించారు? ఇంగ్లండ్పై దారుణమైన ట్రోలింగ్