వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్లీనరీ వేళ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్లీనరీ వేదిక మీదుగా ప్రకటించారు విజయమ్మ. వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లు సభాముఖంగా ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. వక్రీకరణలు, విమర్శలకు తావు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేసినా.. తల్లిగా జగన్కు ఎప్పుడు మద్దతుగానే ఉంటానని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తుందని.. ఆమెకు తాను అండగా నిలవాల్సిన అవసరం ఉందని విజయమ్మ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ‘‘నా కుమార్తె, కొడుకు వేర్వేరు పార్టీలు స్థాపించి.. వేర్వేరు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ముందుకు వెళ్తున్నారు. నేను రెండు పార్టీల్లో కొనసాగడం సరైన నిర్ణయం కాదు. ఏదో ఒకటే పార్టీలోనే ఉండాలి. ఇక వైఎస్సార్ బిడ్డగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం మాట్లాడుతుంది. తండ్రి ఆశయాల కోసమే షర్మిల పోరాడుతుంది. గట్టి ప్రయత్నం చేస్తోంది. తనకు మద్దతుగా ఉండేందుకే ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నాను. కానీ నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు’’ అని తెలిపారు విజయమ్మ. ఆమె నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: AP ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అమెరికా యాసలో ఇంగ్లీష్! ఇది కూడా చదవండి: సీఎం జగన్ పెట్టుకున్న బ్రాండెట్ వాచ్ గురించి తెలిస్తే.. ఔరా అంటారు!