అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా పర్లేదు.. కానీ.. విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అందరు కలసికట్టుగా ఉండాలి. తమ మధ్య ఎన్ని విభేధాలున్నా.. పార్టీ బలోపేతం కోసం కృషి చేసి.. అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి. అంతేకానీ.. తమ ప్రయోజనాల కోసం పార్టీని బలి చేయకూడదు. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి ఇదే పరిస్థితి ఎదురయ్యిందట. ఓ జిల్లాలోని పార్టీ కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నాయట. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే తగువు తీర్చాల్సిన నేతలే.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నంలో సమస్యలు సృష్టిస్తున్నారట. వీరి ఈగోల కారణంగా.. జిల్లాలో పార్టీ పరిస్థితి పూర్తిగా దెబ్బతినేలా ఉందంటున్నారు కార్యకర్తలు. మరి ఏ జిల్లాలో ఇలాంటి పరిస్థితి తలెత్తింది.. తగువులాడుకుంటన్న ఆ నేతలేవరో తెలియాలంటే ఇది చదవండి. ఇది కూడా చదవండి : 2024 ఎన్నికల్లో కొడాలి నాని ఓటమికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్! సిక్కోలు జిల్లాలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ప్రజలు పార్టీకి అండగా ఉన్నారు. వైసీపీ ప్రభావం బలంగా సమయంలో కూడా గత ఎన్నికల్లో ఆ జిల్లా నుంచి టీడీపీ తరఫున ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. పార్టీకి గట్టి పట్టున్న శ్రీకాకుళం జిల్లాలో పెద్ద నేతల మధ్య వర్గ పోరు తమ్ముళ్లను కలవరపెడుతుందట. ఆ పెద్ద నేతలు ఎవరో కాదు ఒకరు ఏపీ పార్టీ మాజీ అధ్యక్షులు కిమిడి కళావెంకట్రావ్, ప్రస్తుత అధ్యక్షులు అచ్చెన్నాయుడి మధ్య వర్గ పోరు నడుస్తోందట. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు ఇద్దరు జిల్లాలో కీలక నేతలు. కష్ట సమయంలో పార్టీకోసం పని చేయాల్సిన నేతల మధ్య అంతర్గత అధిపత్య పోరు నడుస్తుందట. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రస్తుతం అది ముదిరి.. పార్టీకి కూడా తలనొప్పిగా మారిందట. జిల్లా రాజకీయాలు తన కనుసన్నల్లోనే నడిచేలా.. అచ్చెన్న పావులు కదుపుతున్నారట. ఎచ్చర్ల, రాజం, శ్రీకాకుళం, పాలకొండ పార్టీ బాధ్యులుగా ఉన్న వారికి అచ్చెన్నాయుడు ఎసరు పెట్టి.. మొత్తం ఆయన పెత్తనమే సాగేలా చూస్తున్నారని.. కళా వర్గం ఆరోపిస్తోందట. రాజం మినహా మిగతా చోట్ల ఉన్న పార్టీ ఇన్చార్జులు వెంకట్రావు అనుచరులుగా ముద్ర ఉంది. ఇది కూడా చదవండి : చంద్రబాబు మౌనం దేనికి సంకేతం? టీడీపీలో ఏమి జరుగుతోంది? ఇక పార్టీలో అంతర్గత సమస్యలు పరిష్కరించాల్సిన అచ్చెన్నాయుడు.. తానే స్వయంగా సమస్యలను సృష్టిస్తున్నాడని.. తన అనుచరులను అడ్డుకోవడం లేదని కళా వర్గం ఆరోపణలు చేస్తున్నారట. వీరి మధ్య అధిపత్య పోరు ఇలానే కొనసాగితే.. రానున్న ఎన్నికల్లో పార్టీకి బ్యాడ్ న్యూస్ తప్పదని.. తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. దీనిపై ఇప్మపటికే రిపోర్ట్ చంద్రబాబు వద్దకు చేరిందని.. ఈ అంశాన్ని బాబు ఎలా సెట్ చేస్తారో చూడాలి అంటున్నారు కార్యకర్తలు. ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.