కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(75) మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ జైరామ్ రమేశ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి కోవిడ్ పాజిటివ్ అని, ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఆమె హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని అన్నారు. ఈమె నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసులో జూన్ నెలలో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆ సమయంలో ఆమె కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె తనకు కొన్ని రోజులు గడువు కావాలని కోరారు. ఆ తర్వాత ఆమెను గంగారాం ఆసుపత్రిలో చేర్పించారు. కోలుకున్నాక ఇంటికి తిరిగొచ్చిన ఆమె మరోసారి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం బాగానే ఉందని, హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కీలక నేతలు వరుసగా కోవిడ్ బారిన పడుతున్నారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ హెడ్ పవన్ ఖేరా, పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ వాద్రా సైతం కరోనా బారిన పడ్డారు. మరి నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన సోనియా గాంధీ కరోనా బారిన పడడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Congress President Smt.Sonia Gandhi has tested positive for Covid-19 today. She will remain in isolation as per Govt. protocol. आज कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी का कोविड-19 टेस्ट रिपोर्ट पॉजिटिव आया है। वह सरकार द्वारा जारी प्रोटोकॉल का पालन करते हुए आइसोलेशन में रहेंगी। — Jairam Ramesh (@Jairam_Ramesh) August 13, 2022 ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగాల కోసం మహిళలు అధికారుల కోరికలు తీర్చాలట: కాంగ్రెస్ నేత ఇది కూడా చదవండి: Aamir Khan: ఆమిర్ మా రాష్ట్రానికి రాకు.. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి వేరేలా ఉందన్న సీఎం..