గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మొత్తం అప్పుల చుట్టే తిరిగింది. మరీ ముఖ్యంగా ఏపీలో జగన్ ప్రభుత్వంపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. వైసీపీ ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని.. ఇప్పటికైనా కళ్లు తెరకవపోతే.. ఏపీ పరిస్థితి మరో శ్రీలంకలా మారుతుందని.. జోరుగా ప్రచారం చేశాయి. అయితే విపక్షాల విమర్శలని వైసీపీ గట్టిగా కౌంటర్ చేయలేకపోయింది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం రాష్ట్రాల అప్పులు వివరాలు వెల్లడించింది. దాంతో ఇన్నాళ్లు వైసీపీని టార్గెట్ని చేసిన టీడీపీ.. ఈ వివరాలు చూసి గుడ్లు తేలేసింది. ఎలా కౌంటర్ చేసుకోవాలో అర్థం కాక.. నేల చూపులు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. కేంద్రం అప్పుల వివరాలు వెల్లడించి ఇటు వైసీపీ నెత్తిన పాలు.. అటూ టీడీపీ నోటికి తాళం వేయడం రెండు ఒకే సారి చేసింది. శ్రీలంక, పాకిస్తాన్లో నెలకొన్ని ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో గత కొంత కాలంగా రాష్ట్రాల అప్పులపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో లోక్సభలో బీజేపీ సభ్యుడు కిషన్ కపూర్ రాష్ట్రాల అప్పలు గురించి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఈ వివరాలు సభ ముందు ఉంచారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ‘స్టేట్ ఫైనాన్సెస్: ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ఆఫ్ 2021-2022’ని ఆధారంగా చేసుకుని 2020 మార్చి, 2021 మార్చి, 2022 మార్చి నాటికి రాష్ట్రాలకు ఎంతెంత అప్పులు ఉన్నాయో తెలిపారు. దీని ప్రకారం... 2022 మార్చి చివరి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం తమిళనాడుకు అత్యధికంగా రూ. 6,59,868.9 కోట్ల అప్పు ఉండగా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలు రూ. 6 లక్షల కోట్లకు పైగా అప్పులతో ఆ తరువాత రెండు స్థానాలలో ఉన్నాయి. 2022 మార్చి చివరినాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ. 3,98,903.6 కోట్లు కాగా ఇదే సమయానికి తెలంగాణ అప్పులు రూ. 3,12,191.3 కోట్లు. 2021 మార్చి చివరి నాటికి సవరించిన బడ్జెట్అంచనాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్కు అత్యధికంగా రూ. 6,00,006.2 కోట్ల అప్పు ఉండగా.. తమిళనాడు, మహారాష్ట్ర ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి. 2021 మార్చి చివరి నాటికి సవరించిన బడ్జెట్అంచనాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 3,60,333.4 కోట్లు కాగా తెలంగాణ అప్పు రూ. 2,67,530.7 కోట్లు. 2020 మార్చి చివరినాటికి రాష్ట్రాల అప్పులు పరిగణనలోకి తీసుకుంటే రూ. 5,49,559.2 కోట్ల అప్పుతో ఉత్తర్ ప్రదేశ్ అందరి కంటే ముందుంది. మహారాష్ట్ర, తమిళనాడు ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి. 2020 మార్చి చివరినాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 3,07,671.5 కోట్లు కాగా తెలంగాణ అప్పు రూ. 2,25,418 కోట్లు. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం చూసుకుంటే.. అప్పుల జాబితాలో ఏపీ అయితే ప్రథమ స్థానంలో లేదు. మరీ ముఖ్యంగా యూపీతో పోల్చుకుంటే.. ఆ రాష్ట్రానికి ఉన్న అప్పుల్లో సగం మాత్రమే ఏపీ రుణ భారంగా ఉంది. ఇక ఇన్నాళ్లు అప్పులపై విమర్శలు చేస్తున్న టీడీపీకి కౌంటర్ ఇవ్వడానికి అధికార పార్టీకి సరైన అస్త్రం దొరికింది. వాస్తవానికి తెలుగుదేశం హయాంలోనూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అప్పుల మీదే నడిచింది. చంద్రబాబు హయాంలో 2014 నుంచి విపరీతమైన స్థాయిలోనే అప్పులు చేశారు. అప్పుడు అప్పులు చేసి కూడా ప్రజలను ఉద్ధరించింది ఏమీ లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పైగా ప్రస్తుతం వైఎస్ జగన్ హయాంలో అప్పులు చేస్తున్నా.. పథకాల లబ్ధి డైరెక్టుగా ప్రజలకే కలుగుతోంది. ప్రభుత్వం అప్పులు చేసి ప్రజల ఖాతాల్లోకే ఆ డబ్బును పంపిస్తుంది తప్ప తమ జేబుల్లోకి వెళ్లడం లేదని అధికార పార్టీ నాయకులు టీడీపీని కౌంటర్ చేస్తున్నారు. ఇక కేంద్ర వివరాలు వెల్లడించడం.. అటు వైసీపీ టార్గెట్ చేయడంతో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి పాపం.. కక్కలేక మింగలేక అనే విధంగా తయారయ్యింది ఇక మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మోదీ పాలన దగ్గర నుంచి వెలిగిపోతోందనిపించుకుంటున్న గుజరాత్ కన్నా, అన్నీ ఉన్న కర్ణాటక కన్నా.. ఏపీ అప్పుల భారం తక్కువే. దేశంలోనే ప్రథమ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలవుతున్న రాష్ట్రంగా ఏపీ నంబర్ వన్ పొజిషన్లో నిలుస్తుంది. అయితే అప్పుల్లో మాత్రం చాలా రాష్ట్రల కన్నా తక్కువ స్థాయిలోనే ఉంది. మరి కేంద్రం రాష్ట్రాల అప్పులు వివరాలు వెల్లడించిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ ఎలాంటి కౌంటర్ అటాక్ చేస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Ap Debt's pic.twitter.com/Io0ufFUs5j — Sekhar Rambo (@RamboSekhar) July 26, 2022 ఇది కూడా చదవండి: CM జగన్ మంచి చేస్తున్నా.. ఆ ఒక్క తప్పే కొంప ముంచుతోందా? ఇది కూడా చదవండి: కడపలో వింత ఘటన! YCPకి ఎదురు తిరిగిన జగన్ అభిమానులు! కారణం?