కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో రాజకీయం హీటెక్కింది. ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్రతి పార్టీ గెలుపు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. నేడు మునుగోడులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాడు. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి పార్టీ రకరకాల విన్యాసాలు చేస్తుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడేవారు. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో మునుగోడులో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త సెంటిమెంట్ అస్త్రాన్ని తెర మీదకు తెచ్చింది. మునుగోడులో గెలుపు కోసం ఏకంగా లక్షమంది కాళ్లు మొక్కేందుకు సిద్ధ పడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ వివరాలు.. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో జెండా పండుగ నిర్వహించనుంది కాంగ్రెస్. అలాగే అన్ని గ్రామాల్లో కీలక నేతలు పాదయాత్రలు చేయనున్నారు. ప్రతి ఇంటికి పండ్ల బుట్ట పంపిణీ చేయనున్నారు. నియోజకవర్గం అంతటా మన మునుగోడు మన కాంగ్రెస్ పేరుతో స్టిక్కర్లు, కరపత్రాలు పంపిణీ చేయనున్నారు. పాదయాత్రతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు ప్రచారంలోకి దిగనున్నారు. నారాయణ పూర్ మండలం పొర్లగడ్డ తాండా నుంచి రేవంత రెడ్డి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ మునుగోడులో సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే యోచనలో ఉంది. కాళ్లు మొక్కుతా.. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని అడగబోతున్నట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగా నియోజకవర్గంలోనకి లక్ష మంది ఓటర్ల కాళ్లు మొక్కి ఓటు అడిగేలా ప్రణాళిక రచిస్తోంది. ప్రతీ గ్రామానికి ఐదుగురు చొప్పున ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటర్ కాళ్లు మొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ వ్యూహం నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు! ఇది కూడా చదవండి: రాజగోపాల్ రెడ్డి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు.. నిజమైన రాజకీయ నేత అంటూ..!