అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామి రెడ్డి 'వైఎస్సార్-వైవీఆర్' అనే క్యాంటీన్ ని ఏర్పాటు చేశారు. గుంతకల్లులోని ప్రభుత్వ ఆస్పత్రి పక్కన ఆయన ఏర్పాటు చేసిన ఈ క్యాటీన్ ను ఆయన సోదరుడు ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 500 మందికి రుచికరమైన వేడి భోజనాన్ని అందిస్తున్నారు. కేవలం రూ.6కే ఈ భోజనం అందుబాటులో ఉంటుంది. ఎమ్మెల్యే సోదరులను స్థానికలు అభినందించారు. స్థానిక నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భాంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఒక వ్యక్తి ఆకలి తీర్చడం లో వున్న సంతోషం మరెక్కడా దొరకదన్నారు. తన నియోకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ఆసుపత్రికి వచ్చే వాళ్ళకి, ఎంతో మంది పేదప్రజలకు కడుపునిండా అన్నం పెట్టడం ఆనందంగా ఉందని అన్నారు. దేవుడి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఏదో ఉడతా భక్తిగా ఈ చిరు అన్నదాన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి. ఈ అన్నదాన సేవా కార్యక్రమాన్ని తాను ఉన్నంత వరకూ నిస్వార్థంగా, నిరాటంకంగా కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఒక్కపూట తిండి కోసం అలమటించే ఎందరో నిరుపేదలు, నిరాశ్రయుల ఆకలి తీర్చాలన్నదే తన అభిమతమని ఎమ్మెల్యే అన్నారు. అందుకే రూ.6కే రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని క్యాంటీన్లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఓవైపు టీడీపీ అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తుంటే.. YCPఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూడా మంచి మనసుతో క్యాంటీన్ ప్రారంభించారు. మరి.. YCP ఎమ్మెల్యే రూ.6కే భోజనం అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: AP కి కేంద్రం శుభవార్త.. రూ.4,721 కోట్ల నిధులు విడుదల! ఇదీ చదవండి: గోరంట్ల మాధవ్ వీడియో వివాదం.. అది ఒరిజినల్ వీడియో కాదు: అనంత ఎస్పీ