ఢిల్లీ మద్యం అక్రమాల్లో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రమేయం ఉందంటూ బీజేపీ ఎంపీలు ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అంతేకాకుండా బీజేపీ కార్యకర్తలు కవిత ఇంటిని ముట్టడించడం, దాడికి యత్నించారంటూ తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్లు, తెరాస కార్యకర్తలు ఎమ్మెల్సీ కవితను కలిసి సంఘీభావం తెలిపారు. కవితను కలిసిన తర్వాత తలసాని మీడియాతో మాట్లాడారు. “ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలను పట్టుకుని ఇవాళ శాసనమండలి అభ్యర్థి ఇంటిపై దాడికి వచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు ఉండాలి. ఎలాంటి బాధ్యలు లేనివాళ్లు మాత్రమే కాకుండా జిల్లా స్థాయి నేతలు కూడా ఇలా ఇళ్లపై దాడికి రావడాన్ని ఖండిస్తున్నాం. మా పార్టీకి క్రమశిక్షణ ఎక్కువని చెబుతుంటారు. ఇదేనా మీ క్రమశిక్షణ?” అంటూ మంత్రి తలసాని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు మంత్రి తలసాని తనదైనశైలిలో వార్నింగ్ ఇచ్చారు. “ఈడీ కేసులు, పోలీసు కేసులున్న నాయకులు చేసిన నిరాధారోపణలను పట్టుకుని ఇలా ఇళ్లపై దాడికి దిగడాన్ని ఖండిస్తున్నాం. మేం ఎంతమంది ఉన్నామో.. మా పార్టీ బలం ఏంటో మీకు తెలుసు. మీకులాగే మేము కూడా ఇళ్లపైకి, బీజేపీ కార్యాలయాల మీదకు దాడికి వస్తే మీరు మిగులుతారా? మా నాయకుడు మాకు అలాంటి రాజకీయాలు నేర్పలేదు. మా కార్యకర్తలు బీజేపీ కార్యాలయాల మీదకు వెళ్తామంటే అది పద్ధతి కాదంటూ ఆపాము” అంటూ మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. మంత్రి తలసాని వార్నింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: BJP హైకమాండ్ సీరియస్.. పార్టీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్! ఇదీ చదవండి: అమిత్ షా నా గురువు.. చెప్పులు మోస్తే తప్పేంటి: బండి సంజయ్