కర్ణాటకలోని చిత్తాపుర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే.. బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అక్రమాలు జరిగాయని, అలానే ఉద్యోగాల పేరుతో మహిళలను శారీరక కోరిక తీర్చమని అధికారులు అడుగుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగిందని, ప్రభుత్వ ఉద్యోగాలని అమ్ముతున్నారని ఖర్గే ఆరోపించారు. కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్లో 1492 ఉద్యోగాలను భర్తీ చేశారని, ఈ ప్రక్రియలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అధికారుల ప్రమేయంతోనే ఉద్యోగార్హులు అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలో ఓ అభ్యర్థి బ్లూటూత్ పెట్టుకుని పరీక్ష రాస్తుండగా దొరికిపోయాడని అన్నారు. 1492 ఉద్యోగాల్లో 600 ఉద్యోగాలు అమ్ముకునేందుకు ఒప్పందం జరిగిందని ఖర్గే ఆరోపించారు. అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగానికి రూ. 50 లక్షలు, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగానికి రూ. 30 లక్షలు లంచం తీసుకుంటూ రూ. 300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. లక్షలాది మంది అభ్యర్ధుల జీవితాలతో కర్ణాటక ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు. ఈ క్రమంలోనే ఉద్యోగాల కోసం మగవాళ్ళు అయితే లంచాలు ఇవ్వాల్సి వస్తుందని, అదే మహిళలైతే శారీరక కోరిక తీర్చాల్సి వస్తుందంటూ ప్రియాంక్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఖర్గే.. ఎటువంటి ఆధారాలను బయటపెట్టలేదు. దీంతో అటు బీజేపీ నాయకులు, ఇటు నెటిజన్లు ఖర్గే వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఆధారాలు లేకుండా ఇలాంటి స్టేట్మెంట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ దేశంలో మహిళలు గురించి ఏమనుకుంటున్నారు? ఉద్యోగాల కోసం నీచానికి దిగజారతారని అనుకుంటున్నారా? ఈ విషయం పక్క దేశాల వారికి తెలిస్తే అది నిజమనుకోరా? ఒక బాధ్యత గల ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు ఆచీతూచీ వ్యవహరించాలని, ఇలాంటి స్టుపిడ్ స్టేట్మెంట్లు ఇవ్వకూడదని జేడీఎస్ లీడర్ తన్వీర్ అహ్మద్ అన్నారు. ఆయన చేసిన ఆరోపణలు భారత జాతికే అవమానమని, ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీ సర్కార్పై చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది కూడా చదవండి: Aamir Khan: ఆమిర్ మా రాష్ట్రానికి రాకు.. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి వేరేలా ఉందన్న సీఎం.. ఇది కూడా చదవండి: అభ్యంతకర వీడియోలపై కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్..!