వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దానిపై ఎంపీ స్వయంగా స్పందించడం, అది మార్ఫింగ్ వీడియో అంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వైసీపీ సైతం అది నిజమైన వీడియో అని తేలితే తప్పకుండా గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించారు. అంతేకాకుండా తన ఫొటో పెట్టి ప్రచారాలు చేస్తున్నారంటూ సదరు వైసీపీ మహిళా కార్యకర్త సైతం పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ప్రాధమిక దర్యాప్తు వివరాలను విడుదల చేశారు. అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఎంపీ అభిమాని కొణతాలపల్లి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసు వివరాలను ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. “ఈ వైరల్ వీడియో మొదటిసారి Itdp అఫీషియల్ అనే వాట్సాప్ గ్రూపులో ఈనెల 4వ తేదీ అర్ధరాత్రి 2.07గంటలకు +447443703968 అనే నంబరు నుంచి పోస్ట్ చేసినట్లు తేలింది. ఈ పోస్ట్ చేసేందుకు కొన్నిక్షణాల ముందు సదరు నంబరును యాడ్ చేశారు. ఇది యూకే రిజిస్టర్డ్ అయినట్లు తేలింది. ఆ సదరు నంబరు అంతర్జాతీయ నంబరు కావడం వలన సదరు వ్యక్తి వివరాలు సేకరిచే పనిలో దర్యాప్తు కొనసాగుతుంది.” అంటూ తెలిపారు. “ఆ వీడియో ఒరిజినల్ కాదు.. ఒక వ్యక్తి రికార్డు చేసిన వీడియో ఇంకో వ్యక్తికి పంపగా అతను మొబైల్ ఫోన్లో చూస్తుండగా మరో మొబైల్లో రికార్డ్ చేయడం జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వీడియో ఒరిజినల్ కాదు. చాలాసార్లు దీనిని ఫార్వార్డ్, రీపోస్ట్ చేయడం ద్వారా దీనిని ఒరిజినల్ అని నిర్ధారించలేకపోతున్నాం. ఇది ఒరిజినల్ కాదు కాబట్టి.. ఆ వీడియో ఎడిటింగ్ చేశారా? ఒరిజినలా? మార్ఫింగ్ చేశారా? అనే విషయాన్ని నిర్ధారించలేకపోతున్నాం. ఈ వీడియో విషయంలో పలు అనుమానాలు ఉన్నాయి. అసలు వీడియో దొరికే వరకు, పోస్ట్ చేసిన వ్యక్తి దొరికే వరకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు” అంటూ ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. ఇదే అంశంపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకు ఈ కుట్ర చేశారు. ఈ అంశంలో పూర్తి విచారణ పూర్తవ్వగానే లీగల్ యాక్షన్, పరువునష్టం దావా, క్రిమినల్ కేసులు పెడతానంటూ గోరంట్ల మాధవ్ తెలిపారు. ఈ వైరల్ వీడియో అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: వీడియో: గోదావరి యాసలో టీచర్ కి చుక్కలు చూపించిన బుడ్డోడు! ఇదీ చదవండి: మంగళగిరిలో TDPకి ఎదురు దెబ్బ.. పార్టీకి రాజీనామా చేసిన గంజి చిరంజీవి!