గత ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ హావా ముందు తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసిన బడ ఫ్యామిలీలు చిత్తుగా ఓడిపోయాయి. అంతటి వైసీపీ హావాను తట్టుకుని కూడా కింజరాపు కుటుంబం మాత్రం నిలబడి విజయాలు సాధించింది. దివంగత కింజరపు ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా, ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం టీడీపీ వ్యవహారాలు ఢిల్లీలో అబ్బాయి చూసుకుంటుంటే, రాష్ట్రంలో బాబాయ్ చూసుకుంటున్నారు. తాజాగా వీరి గురించి ఓ టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు..వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇదే అంశం వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కింజరాపు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తండ్రి ఎర్రన్నాయుడు మృతితో అనూహ్యంగా రాజకీయాల్లోకి తెరంగ్రేటం చేసిన ఆయన తనయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు. అయితే అతి తక్కువ సమయంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఏ విషయంలోనైనా అనర్గళంగా మాట్లాడటం ఆయనకు అదనపు బలం. దీనివల్లే యువ నాయకుడిగా టీడీపీలో మంచి గుర్తింపు దక్కింది. అయితే టీడీపీ తరపున పార్లమెంట్ లో ఇన్నాళ్లు తన వాణీని వినిపించిన రామ్మోహన్ నాయుడు.. తాజాగా మనసు మార్చుకుని, ఈ సారి ఎమ్మెల్యేగా దిగాలన్న ఆలోచనతో ఉన్నారంట. అయితే అతి చిన్న వయసులోనే ఇంతటి ఛరిష్మా ఉన్న నేత లోక్సభ బరిలో ఉంటేనే మంచిందని.. బాబాయ్ అచ్చెన్నాయుడుతో సహా.. పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారంట. ఎర్రన్నాయుడు నుంచి.. ప్రస్తుతం అచ్చెన్నాయుడు వరకు వారి కుటుంబాన్న టెక్కలి ఆదరిస్తూనే ఉంది. అంతేకాక జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కింజరాపు కుటుంబానికి భారీగా మద్దతుదారులు ఉన్నారు. ఈ కారణాల వల్లే ఆ కుటుంబం నుంచి ఎప్పుడూ ఒకరు ఎంపీగా ఉంటే.. మరొకరు ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్నారు. ఈక్రమంలో ఈ సారి టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా రామ్మోహన్ నాయుడు పోటీ చేయాలని భావిస్తున్నారంట. అంతే కాక మరొక వార్త కూడ ప్రచారంలో ఉంది. అంది ఏమింటే.. రామ్మోహన్ నాయుడి సామాజిక వర్గానికి బాగా పట్టున్న నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగాలని ఆయన ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా ఉంటే రాష్ట్రంలో బలమైన ముద్రపడుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ప్రజల్లో బాగా పట్టున్న రామ్మోహన్నాయుడు ఒక వేళ ఎమ్మెల్యేగా బరిలో దిగితే.. అది పార్టీకి నష్టం కలిగిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు బాబాయ్ అచ్చెన్నాయుడు సైతం ఎమ్మెల్యేగానే పోటీ చేయవచ్చు లేదా బాబాయే మరోసారి కూడా ఎమ్మెల్యేక పోటీ చేసి, అబ్బాయిని ఎంపీగా పోటీ చేయిచవచ్చు.ఈ వ్యవహరంతో జిల్లాలో పార్టీకి నష్టం జరుగుతుందని, ఇది కాస్త గ్రూపు రాజకీయాలకు వేదిక అవుతుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు తెచ్చుకునేందుకు చంద్రబాబు సిద్ధం లేరని కొంతమంది టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరి కింజరాపు కుటుంబలో ఏవిధంగా బరిలోకి దిగ్గనున్నారో వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. మరి...కింజరాపు కుటుంబం పై వస్తున్న రూమర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Sompalli: చంద్రబాబు పర్యటనలో అపశృతి.. వరదనీటిలో పడిన మాజీ మంత్రులు, టీడీపీ నేతలుi ఇదీ చదవండి: సొంత డబ్బులతో ప్రజా సేవ! ఈ వైసీపీ ఎమ్మెల్యే చాలా స్పెషల్! ఇదీ చదవండి: Kesineni Nani: సొంత పార్టీపైనే విమర్శలు.. పార్టీ మారే ఆలోచనలో TDP MP కేశినేని నాని?!