Drug Case: ‘అతిథి దేవో భవ’ అన్న భారత సాంప్రదాయాన్ని గోవా పోలీసులు చక్కగా పాటించారు. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ రష్యా వ్యక్తిని సైతం మర్యాదగా కుర్చీలో కూర్చోబెట్టి మరీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంఘటన గోవాలోని పెర్నెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రష్యాకు చెందిన దిమిత్రీ బోల్డేవ్ అనే వ్యక్తి గత కొంత కాలంగా గోవాలో ఉంటున్నాడు. బోల్డేవ్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని కొద్దిరోజుల క్రితం పెర్నెం పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు రంగంలోకి దిగారు. మోర్జిమ్ వద్ద బోల్డెవ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడి దగ్గరినుంచి ఎల్ఎస్డీ, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 8,50,000 రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా, బోల్డెవ్ను మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అతడ్ని నేరస్తుడిలా కాకుండా అతిథిలా ట్రీట్ చేశారు. కింద నేలపై కూర్చోబెట్టకుండా.. కుర్చీ వేసి అందులో కూర్చోబెట్టారు. ‘అతథి దేవో భవ’ అన్న ధర్మాన్ని చక్కగా పాటించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. వేరే దేశం వ్యక్తి అయితేనేం.. అతడు చేసింది నేరం కాబట్టి మర్యాద ఎందుకివ్వాలని కొందరు.. శత్రువునైనా గౌరవించటం మన దేశ సాంప్రదాయం అని మరికొందరు వాదులాడుకుంటున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : 5 Star Hotel Biryani: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులకు 5స్టార్ హోటల్ బిర్యానీ?