Amarnath Yatra: పరమ శివుడి భక్తులు ఎంతగానో ఎదురు చూసిన అమర్నాథ్ యాత్ర జూన్ 30వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. 43 రోజుల పాటు సాగే ఈ యాత్రలో కొన్ని వేల మంది భక్తులు పాల్గొన్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా యాత్రకు ఆటంకం ఏర్పడింది. వరదల కారణంగా ఇప్పటివరకు 16 మంది చనిపోగా.. 40 మంది గల్లంతయ్యారు. ప్రతీ సంవత్సరం ఇలా ఏదో ఒక అవాంతరం వచ్చిపడుతూనే ఉంది. అయినప్పటికి యాత్రలో పాల్గొనే భక్తుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. ప్రమాదం అని తెలిసినా ప్రాణాలకు తెగించి పరమ శివుడి దర్శనం కోసం భక్తులు పరితపిస్తున్నారు. శివ భక్తులు అమితా శక్తి చూపించే ఈ అమర్నాథ్ యాత్రలో అంత ప్రత్యేకత ఏముంది?.. ఎందుకు శివ భక్తులు ప్రమాదం అని తెలిసినా అమర్నాథ్ యాత్ర కోసం పరితపిస్తున్నారు?... అమర్నాథ్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం? అమర్నాథ్లోని కొండ గుహలో కొలువైఉన్న శివలింగం చాలా ప్రత్యేకమైనది. హిమాలయ పర్వతాల్లోని ఈ శివలింగం శుద్ధ స్పటిక రూపం. ఈ హిమలింగం ప్రళయ కాలంలో వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ హిమ లింగ పరిమాణం చంద్రుడి దిశల్లో మార్పుల కారణంగా పెరుగుతుంది, తగ్గుతుంది. భృగు మహర్షి మొట్ట మొదటి సారి ఈ హిమలింగాన్ని కనుగొన్నారని పురాణాలు చెబుతున్నాయి. వేల ఏళ్ల క్రితం కశ్మీర్లోని లోయ భాగం మొత్తం నీటిలో ఉండేదట. కశ్యప మహర్షి ఆ నీటి మొత్తాన్ని నదులుగా నీటి పాయలుగా చీల్చి అక్కడినుంచి పంపేశాడట. దీంతో అక్కడి నీరు మొత్తం మాయమైంది. అప్పుడు ఏర్పడ్డ దారి గుండా వెళ్లి భృహు మహర్షి అమర్నాథుడి దర్శనం చేసుకున్నారంట. ఆ తర్వాత ఈ హిమ లింగం గురించి తెలుసుకున్న భక్తులు అమర్నాథ్ యాత్ర చేయటం మొదలుపెట్టారు. అయితే, చరిత్రకారులు, స్థానికులు చెబుతున్నది వేరేలా ఉంది. కశ్మీర్లోని గాంధారియా జాతి వాళ్లే మొదటి సారి అమర్నాథ్ గుహను కనిపెట్టారని, శివుడ్ని కూడా మొదట చూసింది వారేనని చరిత్రకారులు, స్థానికులు అంటున్నారు. ప్రమాదాల అమర్నాథ్ యాత్ర సాధారణంగా అమర్నాథ్ యాత్ర జులై నుంచి ఆగస్టు నెలల్లో సాగుతుంది. 1995లో ఈ యాత్ర 20 రోజుల పాటు సాగింది. 2004- 2009లో అది 60 రోజులకు పెరిగింది. ఆ తర్వాత 40నుంచి 60 రోజుల మధ్య సాగింది. ప్రస్తుతం 43 రోజులుగా ఉంది. ఇక, ఈ యాత్ర శ్రీనగర్కు 141 కిలోమీటర్ల దూరంలోని పహల్గాం నుంచి ప్రారంభం అవుతుంది. దేశం నలుమూలలనుంచి జమ్మూకశ్మీర్కు భక్తులు చేరుకుంటారు. అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ పహల్గాంలో ఉంటుంది. పహల్గాం నుంచి అమర్నాథ్కు 45 కిలోమీటర్లు. కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ.. పరమ శివున్ని ధ్యానిస్తూ ముందుకు సాగుతారు. ఈ అమర్నాథ్ యాత్రలో అనారోగ్యాలు, ప్రమాదాలు, మరణాలు సర్వ సాధారణం. 1928లో దాదాపు 500 మంది మరణించారు. 1969లో 40 మంది, 1996లో 243 మంది, 2012లో 12 మంది, 2015లో 3 మంది, 2017లో 18 మంది మృత్యువాత పడ్డారు. మరి, అణువణువునా దైవ భక్తి, ఎంతో ప్రత్యేకతతో పాటు ప్రమాదాలు పొంచి ఉన్న అమర్నాథ్ యాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : BJP MLA Raja Singh: అమర్నాథ్ యాత్రలో ప్రమాదం.. బీజేపీ MLA రాజా సింగ్కు తప్పిన ముప్పు!