ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందా అంటే అది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. నవమాసాలు బిడ్డను మోసి , పురిటి నొప్పులు భరించి బిడ్డకను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అంతేకాదు తల్లి.. తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. అయితే బిడ్డలు పెరిగి పెద్దయి, పెళ్లిలైన తరువాత ఆ తల్లిని పట్టించుకోవడం మానేస్తారు. తమ జన్మకు కారణమైన తల్లి నానా హింసలకు గురించి చేస్తుంటారు కొందరు కుమారులు. అయితే తల్లి విలువ తెలిసిన కొందరు బిడ్డలు.. అమ్మ కోసం ఎలాంటి త్యాగం చేయడానికైన సిద్ధపడుతుంటారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన తల్లి కోసం రూ.లక్షలకు పైగా జీతం వస్తున్న ఉద్యోగాని వదిలేశాడు. అందరు అతడి పిచ్చివాడు, వెర్రి వాడుఅని ఎగతాళి చేసిన పట్టించుకోలేదు. ఇంతకు అతడు రూ.లక్ష జీతం వదలుకునేంత త్యాగం తల్లి కోసం ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.. కర్ణాటకలోని మైసూరుకు చెందిన దక్షిణామూర్తి క్రిష్ణ కుమార్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. నెలకు రూ.లక్షకు పై గా జీతం తీసుకుంటున్నారు. క్రిష్ కుమార్ తల్లికి చిన్నప్పటి నుంచి దేశంలోని పలు ప్రాంతాలను దర్శించాలని కోరిక ఉండేది. కానీ కుదరక జీవితాన్ని అలానే గడుపుతూ వచ్చింది. అయితే క్రిష్ణకుమార్ అమ్మ కోసం రూ.లక్షకు పైగా జీతం వస్తున్న ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి.. ఓ యాత్రికుడిగా, అమ్మకు గైడ్గా మారాడు. తానే స్వయంగా తన తల్లిని ఓ స్కూటర్పైనే తిప్పుతూ చూపిస్తున్నాడు. 2018లో ఈ యాత్రను మొదలుపెట్టారు. మధ్యలో కోవిడ్ మహమ్మారి కారణంగా కొంతకాలం విరామం ఇచ్చారు. మళ్లీ ఆర్నేళ్ల నుంచి తన తల్లి తో కలిసి యాత్రను మొదలుపెట్టి ప్రస్తుతం తిరుమల తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దక్షిణామూర్తి మీడియాతో మాట్లాడుతూ.. జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకునేందుకు.. తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. తండ్రి జ్ఞాపకంగా ఉన్న పాత బజాజ్ చేతక్ స్కూటర్పై 2018 జనవరి 16వ తేదీన భారతదేశ పుణ్యక్షేత్రాల సందర్శనకు శ్రీకారం చుట్టానన్నారు. ఇప్పటికి వరకు దాదాపు 57 వేల కిలోమీటర్లు యాత్రను పూర్తి చేసుకున్నామని తెలిపారు. దక్షిణాభారత దేశంతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కోల్కతా, అరుణాచల్ ప్రదేశ్తో పాటు నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలు సందర్శించామని చెప్పారు. శక్తి ఉన్నంత కాలం.. భగవంతుడు తమకు అవకాశం ఇచ్చినంత కాలం ఈ యాత్ర కొనసాగిస్తామని దక్షిణామూర్తి తెలిపారు. అమ్మకు సేవ చేయడానికి మించిన సంతోషం లేదని, ఆమె ప్రేమ ముందు ఎన్ని లక్షల జీతమైన తక్కువేనని దక్షిణామూర్తి తెలిపారు. మరి.. అమ్మను భారంగా భావించే కొడుకులు ఉన్న కాలంలో అమ్మకోసం తన లక్షల ఉద్యోగానే వదులుకున్న ఈ కొడుకుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: తన పిల్లలని ప్రభుత్వ బడిలో చేర్పించిన ఐఏఎస్ ఆఫీసర్!