చదివింపుల విందు.. ఈ పేరు మనకు కొత్త గాని.. తమిళ వాసులకు మాత్రం ఆ పేరు కొండంత అండ.. కష్టాలను తీర్చే తోడు. ఎలా ప్రారంభం అయ్యిందో మనకు తెలియదు కానీ.. ఈ చదివింపులు విందు గురించి తెలుసుకుంటే.. చాలా మంచి సంప్రదాయం కదా అనిపిస్తుంది. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ఆపన్నహాస్తం ఈ విందు. ఇప్పటికే ఇలాంటి రెండు మూడు సంఘటనల గురించి చదివాం. తాజాగా ఓ చదివింపుల విందులో ఏకంగా 15 కోట్ల రూపాయలు వసూలు అయిన వార్త తెగ వైరలయ్యింది. దాన్ని మరువక ముందే.. మరో సారి వార్తల్లో నిలిచింది చదివింపుల విందు. ఈ సారి కూడా భారీ మొత్తం వసూలు అయ్యింది. 10 కోట్ల రూపాయాలు వచ్చాయి. కాకపోతే.. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే.. ఈ చదివింపుల విందు పేద కుటుంబంలో కాక.. ఓ ఎమ్మెల్యే ఇంట నిర్వహించడం ప్రసుత్తం వైరల్గా మారింది. ఆ వివరాలు.. తంజావూర్, పుదుకోట్టై వంటి ప్రాంతాల్లో గత వందేళ్లుగా ఈ వేడుక నిర్వహిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారు.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండేందుకు ఈ చదివింపుల విందు నిర్వహిస్తారు. తమ స్థోమత మేరకు విందు ఏర్పాటు చేస్తారు. దానికి వచ్చిన వారు భోజనం చేసి.. చేతనైనంత నగదు ఇచ్చి వెళ్తారు. అలా వచ్చిన డబ్బుతో ఆర్థిక కష్టాల నుంచి బయటపడి.. మెరుగైన జీవితాన్ని ప్రారంభింస్తారు. ఇక ఒకసారి చదివింపుల విందు నిర్వహిస్తే.. మళ్లీ ఐదేళ్ల తర్వాతనే ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. ఈ క్రమంలో తాజాగా తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే ఇంట్లో ఈ చదివింపుల విందు చోటు చేసుకుంది. పేరవూరణి నియోజకవర్గ ఎమ్మెల్యే అశోక్కుమార్ తన మనవడి చెవులు కుట్టే వేడుక, చదివింపుల విందు ఒకేసారి ఏర్పాటు చేశాడు. వేడుకలో భాగంగా భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. మాంసాహారం, శాఖాహారం అన్ని రకాల పదార్థాలతో బ్రహ్మండమైన విందు ఇచ్చాడు. చదివింపులు సమర్పించే వారి కోసం ఏకగం 40 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలా మొత్తం 10 కోట్ల రూపాయలు వసూలు కావడం గమనార్హం. అయితే ఈ వార్త తెలిసిన చుట్టుపక్కల ప్రజలు.. ఎమ్మెల్యేకు పెద్దగా ఆర్థిక కష్టాలు ఏం ఉంటాయి. దాని కంటే ఓ పేదవారి ఇంట్లో విందు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. ఇంత భారీ మొత్తంతో వారి జీవితాలు బాగుపడేవి అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: చదివింపుల విందులో వసూళ్ల వర్షం.. ఏకంగా రూ.15 కోట్లు! ఇది కూడా చదవండి: ఆ ఊరి రైతులు ఎక్కడా అప్పు చేయరు! లోన్ తీసుకోరు!