ఇటీవల విమాన ప్రమాదాలు బాగానే జరుగుతున్నాయి. ఎక్కువ శాతం టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా ఓ స్పైస్ జెట్ విమానంలో దట్టంగా పొగలు చేరడంతో ప్రయాణీకులు భయంతో వణికిపోయారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి జబల్ పూర్ కి వెళ్లే స్పైస్ జెట్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ‘ఢిల్లీ నుంచి జబల్పూర్కు స్పైస్జెట్ వెళ్లాల్సి ఉండగా.. అకస్మాత్తుగా ఐదువేల అడుగుల ఎత్తులో క్యాబిన్ లో పొగలు రావడంతో వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే స్పైస్జెట్ ని ఢిల్లీకి తీసుకువచ్చారు. అయితే ప్రజలు కొద్ది సేపు ఇబ్బంది పడ్డా ఎవరికీ ఏమీ కాలేదని స్పైస్జెట్ ప్రతినిధి ఒకరు మీడియాకు వివరించారు. క్యాబిన్లో పొగలు రావడానికి కారణాలపై ఎయిర్ పోర్టు సాంకేతిక సిబ్బంది చెక్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విమానంలో పొగలు అలుముకోవడం, వాటి మధ్య ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరి అవడం.. వీడియోలో కనిపిస్తోంది. ఇలాంటి ఘటనే పాట్నాలో ఇటీవల చోటు చేసుకుంది. స్పైస్ జెట్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పుడు విమానంలో 185 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అయితే టేకాఫ్ అయిన విమానం గాలిలో ఉండగా ఓ పక్షి ఢీ కొట్టడంతో డమ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. విమానాన్ని పట్నాలో అత్యవసరంగా దింపాల్సి వచ్చింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ఒంటి కాలిపై పాఠశాలకు! బాలిక కష్టం చూసి చలించిపోయిన మంత్రి KTR! #WATCH | A SpiceJet aircraft operating from Delhi to Jabalpur returned safely to the Delhi airport today morning after the crew noticed smoke in the cabin while passing 5000ft; passengers safely disembarked: SpiceJet Spokesperson pic.twitter.com/R1LwAVO4Mk — ANI (@ANI) July 2, 2022