దేశంలో ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నా.. కొన్ని చోట్ల మాత్రం విషాద సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వైద్యుల నిర్లక్ష్య, సిబ్బంది లంచాలకు ఎగబడటం.. సరైన సమయానికి అంబులెన్సు లేకపోవడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల తమకు సంబంధించిన వారు మరణిస్తే.. మృతదేహాన్ని రిక్షా, సైకిల్ లేదా భుజాన వేసుకొని వెళ్లిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ కొడుకు తన తల్లి చనిపోతే.. ప్రభుత్వ అంబులెన్స్ లేకపోవడం వల్ల మృతదేహంతో 80 కి.మీ ప్రయాణం కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అనుప్పుర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల జైమంత్రి యాదవ్ ఛాతీ నొప్పికి చికిత్స పొందుతూ షాదోల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి మరణించింది. తన తల్లిని ఊరికి తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో.. బెడ్షీట్లో చుట్టిన తల్లి శవాన్ని 100 రూపాయలతో కొన్న చెక్కపై పెట్టి బైక్కు కట్టి, మరొకరిని వెనక కూచోబెట్టి నడుపుకుంటూ వెళ్లాడు. కొడుకు పరిస్థితి చూసి స్థానికులు కన్నీరు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఈ సందర్భంగా సుందర్ యాదవ్ మాట్లాడుతూ..‘ తల్లి చనిపోయిన తర్వాత అంబులెన్సు, లేదా మార్చురీ వాహనం కోసం సిబ్బందిని అడిగామని.. అక్కడ వాహనాలు అందుబాటులో లేవని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. ప్రైవేటు వాహనం కోసం ప్రయత్నించాను... కానీ, వారు రూ.5వేలు డిమాండ్ చేశారు. వాహనానికి రూ.5వేలు పెట్టేందుకు నా వద్ద డబ్బు లేదు.. అందుకే మృతదేహాన్ని తానే స్వయంగా తీసుకెళ్లాలని అనుకున్నా. షాహ్డోల్ నుంచి అనుప్పుర్ జిల్లాలోని గోదారు ప్రాంతానికి బైక్కు ఓ చెక్కను కట్టి.. దానిపై మృతదేహాన్ని పడుకోబెట్టి తీసుకు వెళ్లానని కన్నీటి పర్యంతం అవుతూ.. తెలిపాడు.’ మరోవైపు ఆస్పత్రి యాజమాన్యం ఈ ఘటనపై స్పందించింది. మృతుడి కుటుంబ సభ్యులు వాహనం కోసం తమను సంప్రదించలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర సింగ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులు అడిగి ఉంటే తప్పకుండా వాహనం ఏర్పాటు చేసి ఉండేవారిమని అన్నారు. ఇక్కడ అందుబాటులో లేకపోతే వేరే చోటి నుంచి తెప్పించి ఉండేవారిమని అన్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. किसी भी राज्य में मंत्रिमंडल क्यों हो,अगर हां तो तस्वीर क्यों नहीं बदलती ये शहडोल का छोटा अस्पताल नहीं मेडिकल कॉलेज हैं बेटे अपनी मां का शव बाइक पर ले जा रहे हैं @ChouhanShivraj इसके बाद भी स्वास्थ्य मंत्री के तर्क हो सकते हैं! आपलोग सिर्फ चुनाव विभाग रखें जो काम साल भर करते हैं pic.twitter.com/NJ9NvoWDsv — Anurag Dwary (@Anurag_Dwary) August 1, 2022 ఇది చదవండి: ఒంటరి మహిళలే అతడి టార్గెట్.. డబ్బు కోసం కక్కుర్తి పడి పాడుపని!